ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో బాధపడుతున్న విషయం తెల్సిందే. మొదట ఆయన సాదారణంగానే ఉన్నా కొన్ని రోజుల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దాంతో ఆయన్ను ఐసీయూకి తరలించి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ప్రధాని నుండి సాధారణ ప్రేక్షకుడి వరకు ఆయన ఆరోగ్యం విషయంలో సమాచారం తెలుసుకునేందుకు ప్రతి రోజు ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్న ఆసుపత్రి వర్గాల వారు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. గత నాలుగు అయిదు రోజులుగా ఆయన ఆరోగ్యం అలాగే ఉండటంతో అంతర్జాతీయ స్థాయి వైధ్యులను విదేశాల నుండి రప్పిస్తున్నారు.
ఒకటి రెండు రోజుల్లో ఆ టీం చెన్నై ఎంజీఎం హాస్పిటల్ కు చేరుకుని ఎస్పీబీని పరీక్షించబోతున్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రపంచ అత్యున్నత శ్రేణి వైద్య బృందంను ఇందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఎంజీఎం ప్రతినిధులు చెబుతున్నారు. బాు గారు కోలుకోవాలంటూ ప్రతి ఒక్కరు ప్రార్థనలు చేస్తున్నారు. సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు ఆయన ఆరోగ్యం కుదుట పడాలని వారి వారి ఆరాధ్యదైవాలను ప్రార్ధిస్తున్నారు.
346830 22419I entirely agree! I came over from google and am seeking to subscribe. Exactly where is your RSS feed? 10347
397263 65027Howdy! I just wish to give a huge thumbs up for the wonderful information you may have here on this post. I will probably be coming back to your weblog for a lot more soon. 924563
653310 916306Some genuinely quality posts on this web site , saved to favorites . 218050