పెద్ద ఎత్తున సాగే ప్రజా నిరసనకు ఏ సర్కారైనా దిగి రాక తప్పదు. ప్రజాగ్రహాన్ని కాదని ఏ ప్రభుత్వమూ మనలేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో రైతన్నలు చేస్తున్న ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. వారితో చర్చించడానికి సిద్ధమని ప్రకటించింది. వ్యవసాయ చట్టాలపై వారికి ఉన్న అపోహలు తొలగించడంతోపాటు వారి డిమాండ్లు అన్నింటిపైనా చర్చిస్తామని పేర్కొంది.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా రైతన్నలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వేలాది మంది రైతులు ఢిల్లీలో సాగిస్తున్న ఆందోళన ఆదివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో అన్నదాతలతో చర్చించడానికి సిద్దంగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ప్రకటించడంతో ఆదివారం వారితో చర్చలకు అధికారులు సన్నద్ధమయ్యారు.
వాస్తవానికి రైతన్నలు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు అనుమతి కోరగా.. చర్చలు జరపడానికి రావాలని ఆహ్వానించారు. దీంతో ప్రభుత్వంతో చర్చించడానికి తాము సిద్దంగా ఉన్నామని పంజాబ్ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రుల్డు సింగ్ వెల్లడించారు. ఈ ఆందోళనల్లో పాల్గొన్న దాదాపు 500 రైతు సంఘాల్లో పంజాబ్ కిసాన్ యూనియన్ కూడా ఉంది. ఇంతకీ రైతుల ఈ ఆందోళనలకు కారణమేంటి? ఓసారి చూద్దాం..
ఇప్పటివరకు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్ యార్డుల్లోనే జరిగేవి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులతో ఈ అమ్మకాలు, కొనుగోళ్ల పద్ధతి మారిపోనుంది. ఇకపై రైతులే నేరుగా ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం బిల్లు-2020 ప్రకారం అన్నదాతలు తమ పంటలను ఎవరికైనా విక్రయించుకోవచ్చు. మార్కెట్ యార్డుకు వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఆధారపడక్కర్లేదు. మధ్యలో ఎలాంటి దళారులూ ఉండరు. మార్కెటింగ్, రవాణా ఖర్చులు కూడా ఉండవు. అలాగే ధరల హామీ-వ్యవసాయ సేవల బిల్లు ప్రకారం రైతులు తాము పండించబోయే పంటకు సంబంధించి ముందుగానే ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం చేసుకోవచ్చు.
ఇక నిత్యావసర వస్తువల సవరణ బిల్లు ప్రకారం ధాన్యం, నూనె గింజలు, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలను నిత్యావసరాల జాబితా నుంచి తొలగించొచ్చు. ఫలితంగా వాటిని బ్లాక్ చేసి తర్వాత ఇష్టానుసారం ధరలు పెంచి అమ్మడానికి వీలుండదు. ఇవన్నీ రైతులకు మేలు చేసేవే అని కేంద్రం చెబుతున్నా.. అన్నదాతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇందుకు కూడా సరైన కారణాలే ఉన్నాయి. ఈ బిల్లులన్నీ అమల్లోకి వస్తే వ్యవసాయ రంగం కూడా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు కంపెనీలు సిండికేటుగా ఏర్పడి, తాము నిర్దేశించిన రేటుకే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే తమకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు. అదే జరిగితే తమకు కనీసం మద్దతు ధర కూడా దక్కదని పేర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా ఎక్కువ మంది రైతులు అంతగా చదువుకోనివారే కావడంతో ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం కష్టమని చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ ప్రైవేటు కంపెనీలు తమకు అనుకూలంగా చేసుకుని దోపిడీకి పాల్పడే అవకాశం ఉందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతన్నలు ఆందోళనబాట పట్టారు.
374120 890912Hey! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im surely enjoying your weblog and appear forward to new updates. 496805
245034 303966This sounds in a way inflammatory pending mecant wait for thisthank you! 972970
216282 826292I conceive this internet web site has got some quite superb info for every person : D. 952268