సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. సాదారణంగా ఎమ్మెల్యే మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు ఆ సీటును ఇచ్చి ఏకగ్రీవం చేయడం జరుగుతుంది.
కాని దుబ్బాక ఏకగ్రీవంకు విపక్షాలు ఒప్పుకోక పోవడంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఇప్పటికే అధికార విపక్ష పార్టీలు ఇండిపెండెంట్స్ అక్కడ జెండా పాతేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది.
అక్టోబర్ 9న ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్ 3న పోలింగ్ ను నిర్వహించి అదే నెల 10వ తారీకున ఫలితాలను వెళ్లడించనున్నారు. సిట్టింగ్ స్థానంను లక్ష ఓట్ల మెజార్టీతో గెలుచుకునేందుకు టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు అక్కడ భారీగా ప్రచారం చేశారు.
ముఖ్య పార్టీలు ఏవీ కూడా ఇప్పటి వరకు అక్కడ అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అన్ని పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో నిమగ్నమయ్యి ఉన్నారు. బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన కత్తి కార్తీక అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే ఆమె ప్రచారం మొదలు పెట్టారు.
737626 602125Thank you for your extremely excellent info and respond to you. 364148
589988 507895Hello! I just wish to give a huge thumbs up for the very good info youve gotten correct here on this post. I will likely be coming back to your blog for more soon. 120195