టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా సొంత నియోజకవర్గంపై మాత్రం నమ్మకంగానే ఉన్నారు.
అయితే.. ఇటివల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కుప్పంలో ఓటర్లు చంద్రబాబుకు భారీ షాక్ ఇస్తూ టీడీపీని ఓడించారు. మరోవైపు.. ఎన్టీఆర్ కు టీడీపీని అప్పగించాలనే బ్యానర్లు వెలుగు చూడటం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామని చెప్పి పావులు కదపడంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు.
దీంతో ఆమధ్య వెంటనే కుప్పంలో పర్యటించిన విషయం విదితమే. అప్పటినుంచి కుప్పంపై తన పట్టు కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈనేపథ్యంలో మరోమారు కుప్పంలో చంద్రబాబు పర్యటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.
జనవరి 6,7,8 తేదీల్లో నియోజకవర్గం లో పర్యటించి పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తారని తెలుస్తోంది. 3 రోజుల పాటు తన పర్యటనలో చంద్రబాబుచ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలను, ప్రజలను కూడా కలుస్తారని అంటున్నారు.
Phrases like seller button, big impaired, little blind and
straddle are sufficient to mistake even experienced poker people of different poker variants.
652716 124458Respect to author , some great info . 798272