Switch to English

పెదబాబుతోపాటే చినబాబూ జైలుకెళ్ళాల్సిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,378FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కాదంటూనే, మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తోంది. సరిగ్గా 45 రోజుల్లో ఈ క్యాబినెట్‌ సబ్‌ కమిటీ తన నివేదికని ప్రభుత్వానికి అందిస్తుంది. దాదాపు అన్ని శాఖల్లోనూ అవినీతి జరిగిందని భావిస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, అన్ని శాఖలకు చెందిన అధికారులూ గత ప్రభుత్వ హయాంలో వచ్చిన జీవోలు, ఇచ్చిన టెండర్లు, చేసిన ఖర్చుల వివరాల్ని ఈ క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి సవివరంగా వెల్లడించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

పుష్కరాల దగ్గర్నుంచి, పోలవరం ప్రాజెక్టు వరకు.. అన్నిట్లోనూ అవినీతి జరిగిందని చెబుతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, మంచి నీళ్ళ ప్యాకెట్ల దగ్గర్నుంచి, ఎలుకలు పట్టడం దాకా, సాధారణ ఖర్చుల దగ్గర్నుంచి ప్రాజెక్టు టెండర్లదాకా.. అన్నింట్లోనూ బూతద్దం పెట్టి వెతకబోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాలు నిగ్గు తేలతాయని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ఆ తర్వాత ఎలాగూ, చట్టపరమైన చర్యలుంటాయనుకోండి. అది వేరే సంగతి.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అడ్డగోలుగా దోచేశారంటూ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూనే వుంది. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలు, తత్ఫలితంగా నమోదైన కేసుల్లో వైఎస్‌ జగన్‌ సహా ఆయనకు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి.. ఏ1, ఏ2 నిందితులుగా వున్న విషయం విదితమే. ఇప్పటికీ ఆ కేసల విచారణల్ని జగన్‌, విజయసాయిరెడ్డి ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు కుట్ర కారణంగానే తాను జైలుకు వెళ్ళాల్సి వచ్చిందన్నది వైఎస్‌ గట్టి నమ్మకం. ఈ నేపథ్యంలో దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో వైఎస్‌ జగన్‌ వున్నారని వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

చంద్రబాబుపై ఎటూ అవినీతి ఆరోపణలున్నాయి.. ఆయన పుత్రరత్నం సంగతి సరే సరి. ఒకేసారి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ జైలుకెళ్ళేలా పక్కా స్కెచ్‌ వైసీపీ రెడీ చేసిందంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ‘మేం ఎవరి మీదా కక్ష సాధింపు చర్యలు చేపట్టడంలేదు. ప్రజలకు జవాబుదారీతనంగా వుండాలి గనుక.. గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీస్తున్నాం. ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది..’ అని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ తదితరులు చెబుతున్నారు. అయితే, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సైతం చంద్రబాబు మీద చాలా కేసులు పెట్టించారనీ, అవేవీ నిలబడలేదనీ.. ఇప్పుడు జగన్‌ మాత్రం ఏం సాధిస్తారని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

రాజకీయం

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ పదవీ ప్రమాణ స్వీకారం.! జనసేన శ్రేణుల్లో అసంతృప్తి.!

వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ప్రధాని మోడీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి సందడి చేయడం.. ‘పవన్ కళ్యాణ్ అనే నేను’ అంటూ పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ మంత్రిగా పదవీ ప్రమాణ...

Pawan Kalyan: త్వరలోనే పిఠాపురం వస్తా.. బొకేలు, శాలువాలు వద్దు: పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అన్న రంగాల నుంచి ప్రముఖులు, మేధావులు, యువత, రైతులు, మహిళలు,...

Kalki 2898: ప్రీ-బుకింగ్స్ లో కల్కి స్పీడ్..! RRR ను దాటేసిందా..!?

Kalki 2898: ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 28798 AD). దేశంలోనే భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న సినిమాగా నిలిచింది....

భారీ వేతనంతో సింగరేణిలో ఉద్యోగాలు

కొత్తగూడెం లోని సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్...

పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా: టీడీపీలో కొందరికి నచ్చట్లేదా.?

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా, ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ అనే బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఆ బ్యానర్ల మీద, జనసేన నేతల ఫొటోలే కాదు, టీడీపీ అలాగే బీజేపీ నేతల ఫొటోలూ...