వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ఓ కథనాన్ని ప్రచురించింది. ‘తనఖా రుణం తన ప్రచారానికి’ అన్నది ఆ కథనం తాలూకు హెడ్డింగ్. చంద్రబాబు, సరిగ్గా ఎన్నికల సమయంలో ‘పసుపు కుంకుమ’ పథకాన్ని ప్రచార ఆర్భాటం కోసం ప్రకటించారన్నది ఆ కథనం తాలూకు సారాంశం. ఇందు కోసం రహదారుల పేరుతో 3,000 కోట్లు అప్పు చేశారట. ఏపీఆర్డిసిని తనఖా పెట్టి రుణం తీసుకున్నారట. అయితే, ఎక్కడా రోడ్లు వేసిన పాపాన పోలేదట. ఆ నిధుల్ని ‘పసుపు కుంకుమ’ పథకం కోసం వాడారట.
ఇంకేముంది.. మేటర్ చాలా క్లియర్. క్షణం ఆలస్యం చెయ్యకుండా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేసెయ్యాల్సిందే.! కానీ, అది సాధ్యమేనా.? ఛాన్సే లేదు. ఎందుకంటే, అది ప్రభుత్వ నిర్ణయం. ‘సంక్షేమ పథకాల’ పేరుతో ఖజానా ఎలా అధికారికంగా లూటీ అవుతోందో చెప్పడానికి ఇదొక నిదర్శనం.
ఇదే పని వైఎస్ జగన్ హయాంలో కూడా జరుగుతోంది. ‘సంక్షేమ పథకాల అమలు’ కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం నిధుల సమీకరణ ఎలా చేపడుతోందో చూస్తున్నాం. భూముల్ని అమ్మేందుకు ప్రయత్నిస్తోంది. ఇంకేవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి కాక, కొత్తగా అప్పులు చేసేస్తున్నారు. చంద్రబాబు చేసింది తప్పే అయితే.. వైఎస్ జగన్ చేస్తున్నదీ తప్పే.
అభివృద్ధి చేసి, తద్వారా వచ్చే ఫలాల్ని ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందించాల్సి వుంటుంది. అదీ ‘పాలన’ అంటే. కానీ, ఇక్కడ జరుగుతున్నది పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, ఇంకోపక్క ఆదాయం పెంచుకోవడానికి పన్నులు పెంచేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం.
దీన్ని ఏమనాలి.? దీన్ని సంక్షేమం అనగలమా.? ఛాన్సే లేదంటారు రాజకీయ విశ్లేషకులు. ఏదిఏమైనా అప్పుడు చంద్రబాబు చేసిందే ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేస్తున్నారు. ‘తన ప్రచారానికి ప్రజాధనం..’ ఇదీ ఓవరాల్గా అందరికీ కన్పిస్తోన్న కాన్సెప్ట్. జనం సొమ్ము అంటే పాలకులకు ఎంత చులకనో కదా.!
767964 138822Spot lets start function on this write-up, I truly think this fabulous website needs a great deal much more consideration. Ill apt to be once more to learn far more, appreciate your that information. 507221