ప్రజాస్వామ్యం అంటే బీజేపీకి చులకనైపోయింది.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీజేపీ నేతలు అనుసరిస్తున్న వైఖరి ప్రతిసారీ వివాదాస్పదమవుతూనే వుంది. కేంద్రంలో అధికారం తమదే కావడంతో ఆ అహంకారం ఏపీ బీజేపీ నేతల్లో నరనరానా జీర్ణించుకుపోయింది. చిత్రమేంటంటే, ఈ పైత్యం ఏపీ బీజేపీ నేతల్లో తప్ప బీజేపీకి చెందిన ఇతర నేతల్లో మరీ అంతగా కన్పించదు.
అసలు విషయానికొస్తే, బీజేపీ నేత రఘురామ్, ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు సర్కార్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డుల్ని బోగస్గా తేల్చేశారు. తమ హయాంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి 600కి పైగా అవార్డులు వచ్చాయని తెలుగుదేశం పార్టీ చెబుతుండడం చూస్తూనే వున్నాం.
రాష్ట్రాలకు కేంద్రం పలు విభాగాల కింద అవార్డులు ఇవ్వడం కొత్తేమీ కాదు. దేశంలోని ఇతర రాష్ట్రాలూ పలు విభాగాల్లో అవార్డులు పొందుతుంటాయి. రోడ్లు వెయ్యడం దగ్గర్నుంచి, ఐటీ సేవల్ని ప్రభుత్వ రంగంలో వాడటం వరకూ.. వివిధ విభాగాల్లో ఈ అవార్డులు ఇస్తారు. ప్రస్తుతం వైఎస్ జగన్ సర్కార్ కూడా అవార్డులు పొందుతోంది. నిజానికి, 2014 నుంచి 2019 వరకూ.. అంటే ఐదేళ్ళలో నాలుగేళ్ళు టీడీపీ – బీజేపీ కలిసే ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాయి. ఆ సమయంలో వచ్చిన అవార్డులు బోగస్.. అంటే, అసలు కేంద్రమే భోగస్ అవార్డులు ఇచ్చి.. దేశ ప్రజల్ని మభ్యపెడుతోందని అనుకోవాలి.
‘అబ్బే, నా ఉద్దేశ్యం అది కాదు.. ఆ అవార్డులు తమ ఘనతగా చెప్పుకుంటున్న టీడీపీనే ప్రశ్నిస్తున్నాం..’ అంటూ మాట మార్చేశారాయన. సరిహద్దుల్లో సైన్యం పోరాడుతోంటే.. ఆ ఘనతని నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ ఖాతాలో వేసేసుకోవడంలేదా.? సర్జికల్ స్ట్రైక్స్ తమ ఘనతేనని ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ చెప్పుకోవడాన్ని ఏమనాలి.? రఘురామ్ మాటలే నిజమైతే, దేశంలో బోగస్ పాలనే నడుస్తోందని అనుకోవాలేమో.!
702963 93101I conceive this internet site has got some real great information for every person : D. 146970