Switch to English

వైఎస్‌ జగన్‌ రివర్స్‌ పాలనపై బీజేపీ కొత్త టర్న్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘పుట్టినరోజునాడు శుభాకాంక్షలు చెప్తే.. అప్పటిదాకా చేసిన తప్పుల్ని క్షమించేసినట్లు కావు.. అన్ని పాపాలకూ లెక్కలుంటాయ్‌..’ అంటూ బీజేపీ సీనియర్‌ నేత రాంమాధవ్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

రాష్ట్ర రాజకీయాల్లో బలమైన రాజకీయ పార్టీగా ఎదగడానికి భారతీయ జనతా పార్టీ నానా తంటాలూ పడుతోన్న విషయం విదితమే. ఈ క్రమంలో తొలుత టీడీపీ – జనసేనతో జతకట్టింది, ఆ తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో తెరవెనుక లాలూచీలు నడిపిందనే ఆరోపణల్ని ఎదుర్కొంది. ప్రస్తుతం అధికారికంగా బీజేపీ – జనసేన మధ్య పొత్తు నడుస్తోంది. అయితే, జనసేన పార్టీ మాత్రమే బీజేపీని మిత్రపక్షంగా భావిస్తోంది తప్ప, బీజేపీ.. జనసేన పట్ల ఆ అభిప్రాయంతో వున్నట్లు కనిపించడంలేదు.

ఏదన్నా విషయమ్మీద జనసేన పార్టీ, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే, దాన్ని వెంటనే ఖండించేందుకు బీజేపీ నుంచి జీవీఎల్‌ నరసింహారావు లాంటి నేతలు వచ్చేస్తుంటారు. అంతెందుకు, సాక్షాత్తూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వైసీపీని విమర్శించినా, జీవీఎల్‌ తదితర నేతలు.. వైసీపీకి పరోక్ష మద్దతు పలుకుతుండడం చూస్తున్నాం.

కానీ, ఇప్పుడు సీన్‌ మారింది. రాంమాధవ్‌ అంటే, ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. మోడీ, అమిత్‌ షాల కనుసన్నల్లోనే రాంమాధవ్‌ వ్వహరిస్తుంటారు. అలాంటి రాంమాధవ్‌, మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో వైసీపీ మీద విరుచుకుపడ్డారు. వైసీపీ, ఆంధ్రప్రదేశ్‌లో రివర్స్‌ పాలన చేస్తోందని ఎద్దేవా చేశారు. ‘అన్ని తప్పులకీ సమాధానపం చెప్పాల్సిందే..’ అంటూ వైసీపీని నిలదీశారు.

నిజానికి, రాంమాధవ్‌ కారణంగానే జనసేన – బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. దాన్ని చెడగొట్టేందుకు జీవీఎల్‌ లాంటి నేతలు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అసలు వైసీపీ పట్ల అంత సానుకూలంగా వుండడానికి జీవీఎల్‌ లాంటోళ్ళకి వున్న ప్రత్యేక కారణాలేంటో చాలామంది బీజేపీ నేతలకే అర్థం కాని పరిస్థితి. ఇక, కన్నా లక్ష్మినారాయణపై వీలు చిక్కితే విరుచుకుపడిపోయే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, రాంమాధవ్‌ విమర్శలపై పెదవి విప్పే సాహసం చేస్తారా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...