నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడా ? అంటే ఆవుననే అంటున్నాయి ఫిలిం వర్గాలు. దిల్ రాజు నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 17ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు అయన బాలయ్యతో సినిమాకు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మొదటి సారిగా దిల్ రాజు ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ సారి అయన చేసేది రీమేక్ సినిమా అని తెలిసింది.
ఆ వివరాల్లోకి వెళితే .. హిందీలో అమితాబ్, తాప్సి కీ రోల్స్ లో వచ్చిన పింక్ సినిమా సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా నెర్కొండ పార్వై పేరుతొ రీమేక్ చేస్తున్నారు. షూటింగ్ ముగింపుకు చేరుకున్న ఈ సినిమా పై కోలీవుడ్ లో మంచి హైప్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని ఆగస్టు లు విడుదల చేస్తారట. ఈ సినిమా హైప్ తెలుసుకున్న దిల్ రాజు ఇప్పడు పింక్ రీమేక్ ని తెలుగులో చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగిందట. అయితే దీనికి సీనియర్ హీరో అయితే బాగుంటుందన్న ఆలోచనలో భాగంగా బాలయ్య తో ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు.
పింక్ సినిమాను తెలుగులో బాలయ్య తో చేస్తే సంచలన విజయం అందుకుంటుందని భావించిన దిల్ రాజు, బాలయ్యతో చర్చలకు సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య నెక్స్ట్ సినిమాను బోయపాటితో చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఇప్పుడు దిల్ రాజు ప్రపోజల్ కు అయన ఓకే చెబుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సో ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
824761 966215You produced some decent points there. I looked online to the problem and discovered a lot of people is going in addition to using your internet site. 677092
67277 3294 Youre so cool! I dont suppose Ive read anything like this before. So nice to find somebody with some original thoughts on this subject. realy thank you for starting this up. this website is something that is necessary on the internet, someone with a bit originality. useful job for bringing something new to the internet! 872889