Switch to English

Baby Pre Release Event: ‘బేబీ’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను: అల్లు అరవింద్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఈ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అల్లు అరవింద్, డైరెక్టర్ మారుతి, బింబిసార దర్శకుడు వశిష్ట, రాహుల్ సంకృత్యాన్, బన్నీ వాసు, మెహర్ రమేష్, బీవీఎస్ రవి, బుచ్చిబాబు సానా, కార్తీక్ వర్మ దండు, బలగం వేణు, వీఐ ఆనంద్, సంపూర్ణేశ్ బాబులు ముఖ్య అతిథులుగా వచ్చారు. అల్లు అరవింద్ బిగ్ టికెట్‌ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘కొంత కాలం క్రితం బేబీ రషెస్ చూశాను. ఇది కల్ట్ సినిమా. రాజేష్ ఆకారం చూస్తే కల్ట్ అనిపించదు. కానీ బుర్రంతా కల్ట్. ఆయన హార్ట్‌ను ఎంత మంది బ్రేక్ చేశారో తెలియడం లేదు. సాయి రాజేష్‌ ఓ మంచి ప్రేమికుడు. కాకినాడలో ఎక్కడో చిన్న మ్యూజిక్ ప్లే చేసుకునేవాడు.. గీతా ఆర్ట్స్‌లో పని చేయించుకోవాలనేలా చేశాడు. టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అని నిరూపించాడు. విజయ్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. వైష్ణవిది రియల్ ఎమోషన్. అలాంటి ఎమోషన్లు ఈ సినిమాలెన్నో ఉన్నాయి. ఆనంద్ గురించి విజయ్‌కి ఫోన్ చేశాను. రష్ చూశాను.. మీ తమ్ముడు ఏంటి చించేశాడు? అని అన్నాను. కొన్ని సీన్లలో ఆయన నటన చూస్తే మన కంట్లోంచి నీరు వస్తుంది. త్రీ రోజెస్ చూసినప్పుడే బాల్ రెడ్డి గురించి అడిగాను. బాల్ రెడ్డి మట్టిలో మాణిక్యం లాంటివాడు. చాక్లెట్ బాయ్ విరాజ్ అశ్విన్‌ కూడా అద్భుతంగా చేశాడు. ధీరజ్‌ త్వరగా పైకి వస్తాడు. బేబీ దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం చాలా మంది ప్రాణం పెట్టి పని చేశారు. ఈ మధ్య కాలంలో సినిమాలో ఒక్క పాట బాగుంటే చాలు ఫేట్ మారుతుంది. అలా నాకు విజయ్ బుల్గానిన్ ఆరు పాటలు ఇచ్చాడు. ఆ ఆరు పాటల కోసం నేను రెండొందల పాటలు రిజెక్ట్ చేశాను. అవన్నీ కూడా ఎంతో గొప్పగా ఉంటాయి. ఈ మూడేళ్లు మేం ఇద్దరం ఎన్నో గంటలు కలిసి పని చేశాం. నెలన్నర నుంచి మా ఇద్దరికీ నిద్ర లేదు. ఆర్ఆర్ మీద పని చేస్తూనే ఉన్నాం. క్యూబ్‌లో నిన్న సినిమా చూశాం. గుండె బరువెక్కింది. బేబీతో విజయ్‌కి పెద్ద బ్రేక్ రాబోతోంది. మా డీఓపీ బాల్ రెడ్డి ముప్పై సినిమాలు చేశాడు. ఒక్క హిట్టు లేదు. బేబీ మా 31వ సినిమా. ఇండియాలో టాప్ టెన్ సినిమాటోగ్రఫర్ల పేరు తీస్తే.. కచ్చితంగా ఆయన పేరు ఉంటుంది. బేబీలోని ఆత్మ విజయ్, బాల్ రెడ్డి వల్లే వచ్చింది. వాళ్లిద్దరే ఈ సినిమాకు కన్ను, చెవి. నేను ఎక్కువగా కోప్పడుతుంటాను. బన్నీ వాసు గారు నా వెనకాల ఉన్నాడనే ఆ పొగరు నాకు ఉండొచ్చు. సినిమాలను ప్రేమిస్తుంటారు. ఫ్రెండ్స్ కోసం నిలబడుతుంటారు. మా బేబీ కోసం కూడా నిలబడ్డారు. హృదయ కాలేయం సినిమాను చూసి మారుతి గారు బాగుందని అన్నారు. బడ్జెట్ ఎంత అని తెలుసుకుని.. నేను చూడని అమౌంట్ నాకు ఇచ్చారు. నా కొబ్బరిమట్ట కష్టాల్లో ఉంటే కాపాడారు. ఆయన సలహాలు తీసుకున్నాను. తప్పులు ఉంటే చెబుతుంటారు. రైటర్ రవి కూడా నా తప్పులు చెబుతుంటాడు. మారుతి, రవి వల్లే బేబీ ఇంత బాగా వచ్చింది. ఎడిటింగ్ రూంలో ఈ సినిమాను చేయడం జరిగింది. విప్లవ్ అద్భుతంగా సినిమాను మలిచాడు. బేబీ హిట్ అయిన తరువాత ఆయన ఏం చేశాడన్నది తెలుస్తుంది. అది మా టీంకు తెలుస్తుంది. ఈ రెండు నెలలు నేను నిద్రపోలేదు. నాతో పాటు ధీరజ్ కూడా నిద్రపోలేదు. నా డైరెక్షన్ టీంకు థాంక్స్. జూలై 14న సినిమా వస్తోంది. ఎంత నిడివి ఉన్నా కూడా మిమ్మల్ని పరిగెత్తిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ఓ ప్రత్యేకమైన సినిమా. అందరూ ఆదరించండి’ అని అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ‘ఆనంద్, వైష్ణవి, విరాజ్ ముగ్గురూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటారు. ఆనంద్ నటనతో అందరినీ ఏడిపిస్తాడు. ఇలాంటి తమ్ముడు ఉన్నందుకు విజయ్ గర్వపడతాడు. అంత అద్భుతంగా నటించాడు. వైష్ణవి చక్కగా నటించింది. బాల్ రెడ్డి, విజయ్ ఇలా అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. అందరూ చూసి సినిమాను ఆదరించండి. మా ఎస్‌కేఎన్ మరిన్ని మంచి చిత్రాలు తీయాలి. ఓ కల్ట్ సినిమా రాబోతోంద’ని అన్నారు.

బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘నేను, మారుతి, ఎస్‌కేఎన్ ఇలా అందరం కూర్చుని ఉంటే.. పాత రోజులు గుర్తొస్తున్నాయి. మేం ఈ రోజు ఇలా ఇక్కడ ఉండటానికి కారణం నా స్నేహితుడు అల్లు అర్జున్. ఆయన మమ్మల్ని అల్లు అరవింద్ వద్ద తీసుకెళ్లాడు. ఆయన స్కూల్ నుంచి మేం ఒక్కొక్కరం ఇలా వస్తున్నాం. సక్సెస్ అవుతున్నాం. ఈ శుక్రవారం బేబీ టీం ఫేట్ మారుతుంది. విజయ్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఆయన మరింత ఎత్తుకు ఎదుగుతాడు. రాజేష్ మంచి దర్శకుడు. మంచి సినిమాను తీశాడు. బడ్జెట్ పెరుగుతోందని అనిపించింది. కానీ ఆయన సినిమా తీయలేదు. ఓ జీవితాన్ని తీశాడు. ఎస్‌కేఎన్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ‘నేను ఈ సినిమాను అల్లు అరవింద్ గారికి అంకితం చేస్తున్నాను. నేను చేసిన సినిమాల్లో జీఏ అని ఉంటుంది. కానీ సోలో నిర్మాతగా నన్ను నిరూపించుకోమని అల్లు అరవింద్ గారు అన్నారు. నా ఫ్రెండ్ మారుతికి ఓ మాటిచ్చాను. ఆయన డబ్బులు పోగొట్టుకోకూడదని అనుకున్నాను. టేబుల్ ప్రాఫిట్‌తో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఇదే నేను ఆయనకు ఇచ్చే గిఫ్ట్. బన్నీ వాస్, మారుతి, యూవీ వంశీ వల్లే నేను ఇండస్ట్రీలో ఉన్నాను. నా స్నేహితుడు సాయి రాజేష్‌లో ఎంతో సత్తా ఉంది. ఆ సత్తాను అందరికీ చూపించాలని ఈ సినిమాను తీశాను. అర్జున్ రెడ్డికి వేసిన ప్రీమియర్ షోలకంటే ఒక్కటైనా ఎక్కువగా వేస్తాను అని విజయ్‌కి ఓ మాటిచ్చాను. విజయ్ ప్రీమియర్ షో చూస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ అన్నట్టు నేను వాళ్ల ఫ్యామిలీకి లక్కీ కాదు.. నాకే వాళ్ల ఫ్యామిలీ లక్కీ.. చాక్లెట్ బాయ్ విరాజ్, వైష్ణవిలు అద్భుతంగా నటించారు. విజయ్, బాల్ రెడ్డి ఇరగదీశారు. ఇక్కడకు వచ్చిన నా స్నేహితులు, దర్శకులకు థాంక్స్. సాయి రాజేష్ కోసం నేను ఎన్ని కష్టాలైన పడతాను. అందుకే బేబీ సినిమాను తీశాను. బేబీ జర్నీలో ధీరజ్ నాకు మంచి స్నేహితుడయ్యాడు. హై ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాతో బేబీని తీశాం. జూలై 14న సినిమాను చూసి విజయవంతం చేయండ’ని అన్నారు.

సహ నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. ‘బేబీ సినిమాను సాయి రాజేష్ అద్భుతంగా తీశారు. ఆనంద్, వైష్ణవి, విరాజ్‌లు చక్కగా నటించారు. జూలై 14న సినిమా రాబోతోంది. అందరూ చూసి విజయవంతం చేయాల’ని కోరారు.

సంపూర్ణేశ్ బాబు మాట్లాడుతూ.. ‘ఒక మామూలు వ్యక్తిని ఈ స్థాయిలో నిలబెట్టిన సాయి రాజేష్ అన్నకి, ఇక్కడకు వచ్చిన పెద్దలందరికీ థాంక్స్. బేబీ సినిమా జూలై 14న విడుదల కాబోతోంది. పాటలు, టీజర్, ట్రైలర్‌లు బాగున్నాయి. చిన్న నటుడైనా నన్ను ఆదరించినట్టుగా.. మా ఆనంద్ దేవరకొండ అన్నను కూడా ఆదరించాలి. మమ్మల్ని ఎప్పుడూ సపోర్ట్ చేసే మారుతి అన్న, ఎస్‌కేఎన్ అన్నకు థాంక్స్’ అని అన్నారు.

బుచ్చిబాబు సానా మాట్లాడుతూ..’ బేబీ సినిమాను చూస్తుంటే హిట్ అని అర్థం అవుతోంది. కొన్ని సినిమాలు విడుదలకు ముందే రిజల్ట్ తెలుస్తుంది. పాజిటివ్ వైబ్ ఉంది. ఆనంద్ స్టోరీ సెలక్షన్ బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ మా ఊరే. ఒక్క పాటతో ఎక్కడికో వెళ్లాడు. ఓ బేబీని కనేందుకు తల్లి తొమ్మిది నెలలు కష్టపడుతుంది. కానీ సాయి రాజేష్‌ గారు మూడేళ్లు కష్టపడ్డారు. ఈ సినిమాను అదిరిపోద్ది’ అని అన్నారు.

బలగం వేణు మాట్లాడుతూ.. ‘బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది. నెలక్రితమే సాయి రాజేష్ అన్నకి ఆ విషయం చెప్పాను. పాటలు అద్భుతంగా వచ్చాయి. రోజుకు రెండు సార్లైనా ఆ పాటలు వింటాను. విజయ్ గారికి ఆ విషయం చెప్పమని అన్నాను. ఈ మధ్య కాలంలో ఇంత మంచి పాటలు వినలేదు.అక్కడే సినిమా సత్తా ఏంటో అర్థం అయింది. సాయి రాజేష్ గారు మూడు సినిమాలు చేశాడు. నాకు మాత్రం కారెక్టర్ ఇవ్వలేదు. చాలా సున్నితమైన వ్యక్తి. ఇలాంటి మంచి వ్యక్తికి మంచి హిట్ రావాలి. బేబీ బ్లాక్ బస్టర్ అవుతుంది. మా బలగం సినిమాకు వైష్ఱవి డేట్స్ ఇవ్వలేదు. ఆనంద్, విరాజ్‌లకు ఆల్ ది బెస్ట్. కెమెరామెన్ బాల్ రెడ్డి మంచి టెక్నీషియన్. టీం అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...