వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రానికి ఎప్పట్లానే వివాదాలు చుట్టుముట్టిన విషయం తెల్సిందే. ముందు టైటిల్ వివాదం, తర్వాత అందులో సీన్లపై అభ్యంతరం ఇలా అన్ని రకాలుగా ఈ చిత్రానికి వివాదాలు వచ్చి సెన్సార్ సభ్యులు సెన్సార్ చేయడానికి కూడా నిరాకరించారు.
అయితే ఈ వివాదంపై అమ్మ రాజ్యంలో టీమ్ కోర్టుకు కూడా వెళ్ళింది. అయితే ఈరోజు సాయంత్రానికి సెన్సార్ అవ్వట్లేదని, కోర్టు కూడా సెన్సార్ సభ్యుల వాదనలకు ఏకీభవించిందని వార్తలు వచ్చాయి. దీంతో సినిమా మరోసారి వాయిదా పడటం ఖాయమని అంతా అనుకున్నారు.
అయితే అందరికీ షాక్ ఇస్తూ తమ సినిమాకి సెన్సార్ పూర్తయిందని రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. ఈ సినిమాను ఆపుదామని అనుకున్న వారి ప్రయత్నాలు ఫలించలేదని, భావ ప్రకటన స్వేచ్ఛ ఈ దేశంలో ఉందని సెన్సార్ సర్టిఫికేట్ ఫోటోను పోస్ట్ చేసాడు. దీంతో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు ఉన్న ఇబ్బందులన్నీ క్లియర్ అయినట్లయింది. రేపు థియేటర్లలో వివాదాలు సృష్టించిన ఈ సినిమా సందడి చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ లో నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేసాడు. జగన్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ ను పోలి ఉన్న పాత్రలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి. విడుదలకు ముందే ఇన్ని వివాదాలు సృష్టించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, విడుదల తర్వాత ఎన్ని సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందో.
720093 453122I think so. I feel your post will give those men and women a great reminding. And they will express thanks to you later 8106
373348 310436Hey there! Someone in my Myspace group shared this web site with us so I came to take a look. Im surely enjoying the info. Im bookmarking and will probably be tweeting this to my followers! Exceptional blog and outstanding style and design. 634564
23771 176446An attention-grabbing discussion is worth comment. I believe that you need to write more on this matter, it wont be a taboo subject even so usually persons are not sufficient to talk on such topics. Towards the next. Cheers 507913