బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కు ఇప్పటికే ముంబయిలో అయిదు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి. వాటిలో ఒకదాంట్లో అమితాబ్ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. మరో దాంట్లో ఆఫీస్ కార్యక్రమాలు రన్ చేస్తారు. మరోటి గెస్ట్ హౌస్ మాదిరిగా ఉపయోగిస్తున్నాయి. మిగిలిన రెండు భవనాలను లీజుకు ఇచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ మరో భారీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు. 31 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈసారి అమితాబచ్చన్ ముంబయిలో డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశాడు.
ముంబయికి చెందిన టైర్ 2 బిల్డర్ క్రిస్టల్ గ్రూపుకు చెందిన అట్లాంటిస్ ప్రాజెక్ట్ లో ఇప్పటికే సన్నీలియోన్ 16 కోట్లు పెట్టి అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసింది. బాలీవుడ్ కు చెందిన పలువురు అక్కడ అపార్ట్ మెంట్ లను కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు అమితాబచ్చన్ 27 మరియు 28వ అంతస్తుల్లో డ్యూప్లెక్స్ ను 31 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. దీన్ని 2020 డిసెంబర్ లో కొనుగోలు చేసి ఈమద్యే రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తోంది. దీంతో అమితాచ్చన్ ముంబయిలో ఇళ్ల సంఖ్య ఆరుకు చేరింది.
681735 779000This web site is often a walk-through like the info you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll surely discover it. 790532
934431 359091Hi there! Very good post! Please do tell us when I could see a follow up! 623009