ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకీ, ‘బ్రో’ సినిమాకీ మధ్య రచ్చ కొనసాగుతోంది. ‘బ్రో’ సినిమాని విదేశాల నుంచి అక్రమంగా తరలించిన నిధులతో తెరకెక్కించారని అంబటి రాంబాబు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి అవకాశమే లేదని ‘బ్రో’ చిత్ర నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.
టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్కి, ‘బ్రో’ సినిమా ద్వారా అక్రమ నిధుల్ని రెమ్యునరేషన్గా ఇచ్చారన్నది అంబటి ఆరోపణ. అంబటి ఆరోపణలు ఎంత హాస్యాస్పదంగా వున్నాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైసీపీలోనే అంతర్గతంగా, అంబటి రాంబాబు యాగీపై రచ్చ నడుస్తోంది.
ఇదిలా వుంటే, ‘బ్రో’ సినిమాకి పెట్టిన పెట్టుబడుల లెక్క తేల్చేందుకోసం మంత్రి అంబటి రాంబాబు వైసీపీకి చెందిన దాదాపు 20 మంది ఎంపీలతో కలిసి ఢిల్లీలో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కలవబోతున్నారట. కలిసి ఫిర్యాదు చేస్తారట. ఈ దెబ్బతో, ‘బ్రో’లో పెట్టుబడుల వ్యవహారం తేలిపోతుందని వైసీపీ అంటోంది.
అయితే, ‘మా బిజినెస్ లెక్కలు పక్కాగా వుంటాయ్. మేం, కేవలం ఆదాయపు పన్ను శాఖకి మాత్రమే జవాబుదారీ’ అంటున్నారు ‘బ్రో’ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. సినిమా నిర్మాణం కోసం నెట్ఫ్లిక్స్ తదితర సంస్థలు 70 శాతం వరకు నిధులు సమకూర్చాయన్నది ఆయన వాదన.
పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి, ఓటీటీ రైట్స్ భారీగానే వుంటాయ్. ఆ లెక్కన, సినిమాకి పెట్టుబడులనేది అసలు సమస్య కానే కాదు.
Thanks, this website is extremely practical. [url=http://gctech21.com/bbs/board.php?bo_table=sub0501_n2&wr_id=688951]Erfahrungsberichte über proventil in Amsterdam[/url]