Switch to English

బిగ్ బాస్ సీజన్ 5: ఎమోషనల్ గా సాగిన నామినేషన్ ప్రక్రియ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రతీసారి నామినేషన్స్ అంటే జరిగే రచ్చ మాములుగా ఉండదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, అరుచుకోవడంతో బిగ్ బాస్ హీట్ పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఈసారి నామినేషన్స్ ప్రక్రియను వినూత్నంగా నిర్వహించాడు బిగ్ బాస్. హౌజ్ మేట్స్ అందరికీ ఇంటి నుండి లెటర్స్ వచ్చాయని చెప్పిన బిగ్ బాస్, అవి చదవాలి అంటే మాత్రం కచ్చితంగా త్యాగం చేయాల్సి ఉంటుందని తెలిపాడు.

బిగ్ బాస్ చెప్పిన ప్రాసెస్ ప్రకారం ప్రతీసారి ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తుంటాడు. అలా వచ్చినప్పుడు ఉత్తరాలు వస్తాయి. పోస్ట్ మ్యాన్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ పిలిచిన దాని ప్రకారం ఇద్దరు ఇంటిసభ్యులు పవర్ రూమ్ కు వెళ్లాల్సి ఉంటుంది. వారి చేతికి మరో ఇద్దరు ఇంటి సభ్యులకు సంబంధించిన ఉత్తరాలు ఇస్తారు. వీరిలో ఒకరి ఉత్తరం శ్రద్దర్ లో వేయాల్సి ఉంటుంది. అంటే వారి లెటర్ ముక్కలుగా చిరిగిపోతుంది. దాంతో పాటు లెటర్ అందుకోని ఇంటి సభ్యుడు డైరెక్ట్ గా నామినేట్ అవుతాడు. లెటర్ అందుకున్న వారు సేఫ్ అవుతారు.

ఈ ప్రాసెస్ లో భాగంగా ముందుగా మానస్, శ్రీరామ్ లను పిలిచారు. వారికి ప్రియాంక, లోబోలకు సంబంధించిన లెటర్స్ వచ్చాయి. ఇందులో లోబో త్యాగం చేసి ప్రియాంకకు లెటర్ వచ్చేలా చేసాడు. లోబో లెటర్ శ్రద్దర్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత విశ్వ, సిరిల లెటర్స్ షణ్ముఖ్, రవి లకు వచ్చాయి. విశ్వ తన కొడుకు విషయంలో ఎమోషనల్ అవ్వడంతో సిరి త్యాగం చేసింది. ఆ తర్వాత ఎన్నీ మాస్టర్, మానస్ ల లెటర్స్ కాజల్, ప్రియాంకలకు వచ్చాయి.

మానస్ త్యాగం కారణంగా ఎన్నీ మాస్టర్ కు లెటర్ వచ్చింది. ఆ తర్వాత రవి, శ్రీరామ్ లకు లింక్ పడింది. ఇద్దరూ కూడా పర్లేదు మా లెటర్స్ చింపేయండి అంటూ త్యాగం చేయబోయారు. అయితే లోబో వచ్చి రవితో నీ దగ్గర నీ ఫ్యామిలీకు సంబంధించి ఏదో ఒకటి ఉంది కానీ శ్రీరామ్ కు ఏం లేదు కదా అని చెప్పడంతో రవి లెటర్ ను చించేశారు. ఫైనల్ గా షణ్ముఖ్, కాజల్ లలో షణ్ముఖ్ తన లెటర్ ను త్యాగం చేసాడు.

ఇక మిగిలి ఉన్నది జెస్సీ. తన లెటర్ ఇవ్వాలంటే హౌజ్ లో కెప్టెన్ గా ఉన్న సన్నీ ఎవరో ఒకరి లెటర్ ను చించేయాల్సి ఉంటుంది. ఆ ఇంటి సభ్యుడ్ని జెస్సీ స్థానంలో నామినేట్ చేయాల్సి ఉంటుంది. లేదా జెస్సీ లెటర్ ను శ్రద్దర్ లో వేసి డైరెక్ట్ గా జెస్సీను నామినేట్ చేయొచ్చు. ఇక్కడ శ్రీరామ్ చంద్ర తన లెటర్ ను చించడానికి ఒప్పుకుని జెస్సీను సేవ్ చేసాడు. సో, జెస్సీకు కూడా లెటర్ వచ్చింది. కెప్టెన్ అయిన సన్నీకు ఎటువంటి షరతులు లేకుండా లెటర్ ఇచ్చారు. మొత్తానికి ఈసారి నామినేషన్స్ లో లోబో, సిరి, మానస్, శ్రీరామ్, రవి, షణ్ముఖ్ ఉన్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...