అమ్మ ఒడి, జగనన్న కానుక.. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోన్న సంక్షేమ పబ్లిసిటీ స్టంట్లలో ఇవి కాస్త ప్రత్యేకమైనవి. తమ ప్రభుత్వం విద్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని వైసీపీ చాలా ఘనంగా చెప్పుకుంటోంది. ‘నాడు నేడు’ అంటూ స్కూళ్ళను సరికొత్తగా తీర్చిదిద్దేందుకూ ప్రయత్నిస్తోంది.
మంచిదే.. విద్య విషయంలో ప్రభుత్వం ఎలాంటి మంచి ఆలోచనలు చేసినా అభినందించి తీరాల్సిందే. మంచి విద్య.. రేపటి అందమైన భవిష్యత్తుకు దారి చూపెడుతుంది. కానీ, ఎయిడెడ్ స్కూళ్ళపై ప్రభుత్వ వ్యూహాలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నవైనంపై ఎవ్వరూ పెదవి విప్పరేం.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఎయిడెడ్ స్కూళ్ళు మూతబడుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇది ఉత్త ప్రచారమే కాదు, ‘ప్రభుత్వం తీరు కారణంగా స్కూళ్ళను మూసేయడం తప్ప వేరే దారి లేదు..’ అంటూ ఆయా స్కూళ్ళ నిర్వాహకులకు విద్యార్థులకు తేల్చి చెబుతున్నారు.
తాజాగా, విశాఖ జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, ‘మాకు జగనన్న కానుక వద్దు.. మాకు అమ్మ ఒడి వద్దు.. మాకు స్కూల్ కావాలి..’ అంటూ నినదించడం గమనార్హం.
మామూలుగా అయితే, సంక్షేమ పథకాలు వద్దని ప్రజలెవరూ నినదించే పరిస్థితి వుండదు. ఎందుకంటే, ఎవరు అధికారంలో వుంటే వారు.. తమ పేర్లతో ఆయా పథకాలకు సొంత ప్రచారం చేసుకుంటున్నా, ఆయా సంక్షేమ పథకాలు అమలయ్యేది ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చే నిధులతోనే. అంటే, అది ప్రజాధనం.
వైఎస్ జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమ్మ ఒడి, జగనన్న కానుక.. అంటోంది. ప్రతి యేడాదీ ఈ మేరకు విపరీతమైన పబ్లిసిటీ స్టంట్లు కూడా చేస్తోంది. బెల్టు, బూట్లు, పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం.. ఇలా అన్నిటి మీదా తమదైన ‘ముద్ర’ వుండేలా చూసుకుంటోంది వైసీపీ సర్కారు.
ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచే వ్యతిరేకత మొదలైందంటే, అది ఆషామాషీ వ్యవహారం కాదు. అందునా ఓ విద్యార్థి, స్కూలు కోసం జరిగిన ఆందోళన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ విద్యార్థికి జనసేన ముసుగు వేసేందుకు వైసీపీ మద్దతుదారులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఏదిఏమైనా, సంక్షేమం మాటున ‘రాజకీయం’ ప్రజలకు అర్థమవుతోందన్నది నిర్వివాదాంశం. ఈ చైతన్యం, అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
బెల్టులు ,బూటులు ,అమ్మవడి మాకొద్దు ;మా స్కూల్ మాకు కావాలి !!CM DOWN !! DOWN !! అంటూ నిన్న విశాఖ జ్ఞానాపురం వద్ద నినాదాలు చేస్తున్న విద్యార్థులు తల్లి తండ్రులు.
Issue arises because of ruling YCP decision to close Govt Aided Schools and colleges. pic.twitter.com/QOcKuoPCEM— Pawan Kalyan (@PawanKalyan) October 26, 2021
848766 804014Safest the world toasts are created to captivate and also faithfulness to your wedding couple. Beginner sound system watching high decibel locations would be wise to always remember some sort of vital secret produced by presentation, which is your auto. best man speeches funny 602378
998648 962481Hey there! Great stuff, please do tell us when you post once again something comparable! 607555