Switch to English

బిగ్ బాస్ తెలుగు-5 : వరస్ట్‌ జెస్సీ జైలుకు, బెస్ట్ విశ్వ- ఎపిసోడ్- 6

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్‌ సీజన్ 5 మొదటి వారం ముగింపు దశకు వచ్చేసింది. ఆదివారం షురూ అయిన ఈ సీజన్ లో మొదటి రోజు ఎపిసోడ్ మొత్తం కంటెస్టెంట్స్ పరిచయం జరిగింది. ఆ తర్వాత సోమవారం ఎపిసోడ్‌ నుండి అసలైన రచ్చ మొదలైంది. బిగ్ బాస్ అంటేనే గొడవలు అన్నట్లుగా సీజన్‌ లో కూడా గొడవలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున బిగ్ బాస్ సీజన్ 5 లో మొదటి వారంలోనే రచ్చ రంబోలా జరిగింది. అమ్మాయిలు, ఆడవారు, మగవారు అందరు కూడా ఈ సీజన్ లో రచ్చ చేసి పారేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ కాకుండా అందరు కూడా తెగ హడావుడి చేస్తున్నారు. బిగ్‌ బాస్ సీజన్‌ 5 కి హోస్టింగ్‌ చేస్తున్న నాగార్జున నేడు కంటెస్టెంట్స్ ముందుకు వస్తాడు. వారికి క్లాస్ లు పీకబోతున్నాడు. ఆ విషయం పక్కన పెడితే తాజా ఎపిసోడ్‌ లో ఏం జరిగింది అనేది చూద్దాం పదండి..

ఎపిసోడ్‌ ఆరంభంతోనే పింకీ మరియు మానస్ ల మద్య మాటలు కలిశాయి. ఈ విషయమై బిగ్ బాస్ కంటెంట్ క్రియేట్‌ చేసేలా ప్రయత్నించాడు. రోజ్ ఇస్తూ ఇది నీ వద్దే ఉంచుకోవాలని ప్రియాంక అంటే తప్పకుండా అంటూ ఒక డబ్బాలో దాన్ని దాచుకున్నాడు. ఇద్దరి మద్య వ్యవహారం బాగానే ముందుకు సాగుతుంది అంటూ ప్రేక్షకులు ఒక అభిప్రాయంకు వచ్చేశారు. ఇక బిగ్‌ బాస్ మొదటి వారంలో లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ సాగింది. అందులో భాగంగా ఇద్దరిని ఎంపిక చేసుకుని ఒకరు ఎత్తుకుంటే మరొకరు కుండలను పగులకొట్టాలి. ఆ పని శ్రీరామ్ చంద్ర మరియు విశ్వలు చేశారు. నటరాజ్ మాస్టర్ ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనను పట్టించుకోలేదు అంటూ అలిగాడు. రవి ఆయన్ను కాస్త సముదాయించాడు. ఆ తర్వాత శ్రీరామచంద్ర ఎత్తుకోగా విశ్వ కుండలను బద్దలు కొట్టి లగ్జరీ బడ్జెట్‌ ను తీసుకున్నారు. లగ్జరీ బడ్జెట్ వస్తువులు రావడంతో ఇంటి సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

వినాయక చవితి సందర్బంగా ఇంటి సభ్యులు అంతా కలిసి పూజ చేశారు. అందరు అందంగా తయారు అయ్యి కనిపించారు. పూజ సమయంలో యాంకర్ రవి, లోబో, నటరాజ్ మాస్టర్ ఇంకా కొందరు కన్నీరు పెట్టుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో ఈ పండుగ చేసుకోలేక పోయాం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక పూజ పూర్తి అయిన వెంటనే బిగ్‌ బాస్ మొదటి వారం వరస్ట్ ఫెర్ఫార్మర్‌ మరియు బెస్ట్‌ ఫెర్ఫార్మర్ ను ఎంపిక చేయడం జరిగింది. ఆ సమయంలో ఒకొక్కరు ఒక్కో విధంగా మాట్లాడాడు. ఎక్కువ శాతం మంది జెస్సీని వరస్ట్ ఫెర్మార్మర్ అనేశారు. బెస్ట్ అంటే విశ్వకు ఎక్కువ మార్కులు పడ్డాయి. దాంతో బిగ్‌ బాస్ సీజన్‌ 5 మొదటి వారం వరస్ట్ ఫర్ఫార్మర్ అయిన జెస్సీకి జైలు తప్పలేదు. వరస్ట్‌ గురించి మాట్లాడిన సమయంలో ప్రియాంక కాస్త సీరియస్ గానే ఉమా పై వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలోనే నోరుముయ్యి అంటూ సీరియస్ గా వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలతో కాస్త హౌస్‌ సీరియస్ అయ్యింది. ఆ తర్వాత ప్రియాంక తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగింది. మొత్తానికి ఎపిసోడ్ 6 కూడా రచ్చ రచ్చ అన్నట్లుగానే సాగింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...