Switch to English

సినిమా రివ్యూ : మేరా భారత్ మహాన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

నటీనటులు : అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ, శ్రీధర్ రాజు, గిరిబాబు, బాబు మోహన్, తనికెళ్ళ భరణి, ఎల్ బి శ్రీరామ్, ఆమని తదితరులు .
బ్యానర్ : ప్రత ప్రొడక్షన్స్
సంగీతం : లలిత్ సురేష్
డైలాగ్స్ : ఎర్రం శెట్టి సాయి
కెమెరా : ముజిర్ మాలిక్
ఎడిటింగ్ : మేనగ శ్రీను
దర్శకత్వం : భరత్
నిర్మాతలు : డా. శ్రీధర రాజు, డా. తాళ్ల రవి, డా. పల్లవి రెడ్డి

సమాజంలో జరుగుతోన్న అన్యాయాలను, అక్రమాలను ఎత్తిచూపే కథాంశాలతో ప్రేక్షకుల్లో మార్పు తేవాలని కోరుకునే ప్రయత్నంలో చాలా సినిమాలు వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చినా జరిగే అన్యాయాలు మాత్రం ఆగడం లేదు. అయినా జనాల్లో చైతన్యం తేవడానికి మరోసారి నిర్మాత శ్రీధర్ రాజు తన స్నేహితులతో కలిసి చేసిన ప్రయత్నమే మేరా భారత్ మహాన్. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. మేరా భారత్ మహాన్ అంటూ వీళ్ళు చేసిన ప్రయత్నం ఏమిటో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

మహాన్ ( శ్రీధర్ రాజు ) తన జీవితంలో జరిగిన అన్యాయాలకు తన కుటుంబాన్ని మొత్తం కోల్పోతాడు. దాంతో తనకు జరిగినటువంటి అన్యాయాలు ఇంకెవ్వరికి జరగకూడదనే ఉద్దేశంతో మేరా భారత్ మహాన్ ( ఎం బి ఎం ) అనే సంస్థను స్థాపిస్తాడు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కార్పొరేట్ వ్యవస్థను సమూలంగా నాశనం చేయడమే ద్యేయంగా పెట్టుకుంటాడు. మహాన్ ఆశయాలకు యువత సపోర్ట్ తోడవుతుంది. ఈ సంస్థలో కీలక సభ్యుడిగా ఉన్న తనికెళ్ళ భరణి వీరిని ఎప్పుడూ ముందుకు కదిలేలా మోటివేట్ చేస్తుంటాడు. అదే సంస్థలో వాలైంటర్ గా ఉన్న కార్తీక్( అఖిల్ కార్తీక్ ) సంజిత ( ప్రియాంక శర్మ ) ఒకరికొకరు చిన్నప్పుడే తెలుసు. ఎందుకంటే ఒకేఊరిలో కలిసి చదువుకున్నారు. పైగా ఒకరి పై ఒకరికి ప్రేమ ఉంటుంది. ఓ వైపు ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరూ మరో వైపు ఎం బి ఎం కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి మీటింగ్ లో ఓ బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేస్తారు. అది అనుకోకుండా టార్గెట్ దగ్గర కాకుండా టీమ్ చేతిలోనే పేలుతుంది. దాంతో చాలా మంది టీమ్ సభ్యులు మరణిస్తారు. అసలు ఈ బాంబు బ్లాస్ట్ చేసి ముఖ్యమంత్రిని ఎందుకు చంపడానికి ప్లాన్ చేస్తారు. అసలు వీళ్ళ ఉద్దేశం ఏమిటి ? కార్పొరేట్స్ పై ఉన్న కోపాన్ని మహాన్ ఇలా ఎందుకు తీర్చుకోవాలనుకున్నాడు ? మరి ఈ పోరాటంలో హీరో, హీరోయిన్లు ఒక్కటయ్యారా? లేదా అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

కార్తీక్ ( అఖిల్ కార్తీక్ ) హీరోగా మంచి నటన కనబరిచాడు. తన లైఫ్ లో జరిగే విషయాలపై పోరాటం చేస్తూ హీరోయిజాన్ని చూపించాడు. ఇక హీరోయిన్ సంచిత ( ప్రియాంక శర్మ ) నటన, చలాకీతనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలో సూపర్ అనిపించుకుంది. ఇక మహాన్ గా లీడ్ రోల్ పోషించిన శ్రీధర్ రాజు పాత్ర చాలా బాగుంది. శ్రీ శ్రీ డైలాగ్స్ తో సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, జనాలు ఎలా బతుకుతున్నారు అన్న విషయాలను చాలా చక్కగా చూపించి శభాష్ అనిపించాడు. ప్రస్తుతం విద్య, వ్యవసాయం, వైద్యం, ఇలా అన్ని కార్పొరేట్ మాయలో పడి కొట్టుకుపోతూ సామాన్య జనాలను అనాథలుగా మిగులుస్తున్నాయని చూపించే ప్రయత్నం మెచ్చుకోవలసిందే. రైతుల ఆత్మహత్యలకు కారణాలు, విద్యార్థుల సూసైడ్స్ ల గురించి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఉద్యోగాల కోసం తిరుగుతున్న అందమైన అమ్మాయిలను కొందరు కేటుగాళ్లు ఎలా మాయలో పడేస్తారు, ఉద్యోగాలు దొరక్క యువత ఎలా చెడు మార్గాల్లో పడుతున్నారన్న విషయాలపై మంచి అవగాహన పెంచారు. గిరిబాబు, బాబు మోహన్ లు కామెడీ పండించే ప్రయత్నం బాగుంది. అమల పాత్ర కొంతసేపే అయినా ఆ పాత్ర ఆకట్టుకుంటుంది. ఇక మిగతా పాత్రల్లో ఎవరికీ వారు బాగానే చేసారు.

టెక్నీకల్ హైలెట్స్ :

ఈ సినిమాకు టెక్నీకల్ విషయంలో ముందుగా చెప్పుకోవలసింది కథ గురించి. కమర్షియల్ సినిమా తీసి నాలుగు డబ్బులు వెనకేసుకుందామన్న ఆలోచన పక్కన పెట్టి సమాజానికి మంచి మెసేజ్ అందించాలన్న ఆలోచన ఉన్న శ్రీధర్ రాజు ప్రయత్నం గొప్పది. ఎర్ర వీరుడి పాత్ర శైలిలో సాగే మహాన్ పాత్రకు కొత్త టచప్ ఇచ్చి ఆకట్టుకునేలా చేసారు. అయితే అతను పలికిన డైలాగ్స్ .. డబ్బింగ్ కు కాస్త లిప్ సింక్ కుదరలేదు. నిర్మాతలు కూడా ఎక్కడ రాజీ పడలేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ లలిత్ సురేష్ ఇచ్చిన పాటలు కథను నడిపించేలా ఉన్నాయి. అయితే కొన్ని పాటలు ఇంకాస్త ఇంపాక్ట్ ఇచ్చేలా వుంది ఉంటే బాగుండేది. ఎడిటింగ్ విషయంలో చెప్పుకోవలసింది ఏమీలేదు. ఉన్నంతలో చక్కగా ట్రిమ్ చేసాడు. ఇక కెమెరామన్ ముజిర్ మాలిక్ ఫోటోగ్రఫి సూపర్. అతను ఎక్కువగా డ్రోన్ షాట్స్ వాడడం కాస్త కథకు కొత్త లుక్ ని తెచ్చిపెట్టింది. ఇక ఎర్రం శెట్టి సాయి అందించిన మాటలు బాగున్నాయి. నేటి సమాజంలో జరుగుతోన్న సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు భరత్. కథ విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే సన్నివేశాల పొంతన అంతగా కుదరలేదు. కాస్త కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది.

విశ్లేషణ :

సమకాలీన సమస్యలను, సమాజంలో సామాన్యుడు ఎదుర్కొంటున్న సవాళ్ళను కథగా మలచి కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి ప్రయత్నం. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు, వాటివల్ల కార్పొరేట్స్ ఎంతటి లాభాలు పొందుతున్నారన్న విషయాలు చక్కగా చూపించే ప్రయత్నం చేసాడు. మాటలు బాగున్నాయి. కథ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. నేటి కార్పొరేట్ సంస్థలు ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తుంది, కార్పొరేట్ కల్చర్ వల్ల రైతులు, విద్యార్థులు, యువత ఎలా సఫర్ అవుతున్నారు అన్న విషయాలు బాగా చూపించారు. సినిమాకు సంగీతం ప్రధాన ఆకర్షణ, ఎడిటింగ్ ఉన్నంతలో బాగుంది. ఇక నిర్మాత శ్రీధర్ రాజు ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.

ట్యాగ్ లైన్ : అభినందించాల్సిన ప్రయత్నం

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...