నిత్యం వివాదాలతో సావాసం చేస్తూ ఉంటుంది నటి విజయలక్ష్మి. మొదట్లో హీరోయిన్ పాత్రలలో మెరిసిన విజయలక్ష్మి ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రలకు పరిమితమైంది. అయితే నిత్యం వివాదాలు ఆమె కెరీర్ ను వెనక్కి నెడుతున్నాయి. ఇప్పటికే రాజకీయ నేతపై చేసిన విమర్శలతో విజయలక్ష్మి వివాదాల్లో నానుతోంది. ఇక తాజాగా లాడ్జిలో ఆమె చేసిన నిర్వాకంతో మరింత ఇబ్బందుల్లో పడింది ఈ నటి. అసలు విషయంలోకి వెళితే..
నామ్ తమీజర్ కచ్చి నేత సీమాన్తో తనకు అఫైర్ ఉందని, ఆ రాజకీయ నేత తనను వాడుకుని వదిలేశాడని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై తమిళనాడులో పెద్ద దుమారమే రేగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరు నుండి చెన్నైకు మకాం మార్చి తిరువన్మియూర్ అనే లాడ్జిలో ఉంటూ వస్తోంది.
ఇక సీమాన్ తనకున్న వివాదం నేపథ్యంలో లాడ్జిలో ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేయడం కూడా సంచలనమే. ఇదంతా ఇలా ఉంటే తాజాగా విజయలక్ష్మి నివాసం ఉంటోన్న తిరువన్మియూర్లోని లాడ్జి యజమాని ఆమెపై పోలీస్ కేసు నమోదు చేసాడు. విజయలక్ష్మి తనకు అద్దె చెల్లించట్లేదని, దాదాపు 3 లక్షల రూపాయలు ఆమె నుండి తనకు రావాల్సి ఉందని, అది ఇప్పించాల్సిందిగా పోలీసులను ఆశ్రయించాడు. మరి ఈ కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
572594 357461You need to be a part of a contest first with the most effective blogs online. Let me suggest this weblog! 382421