Switch to English

బిగ్ బాస్4: ఎపిసోడ్ 43- అఖిల్‌ ను ఏడిపించి ట్విస్ట్‌ తో కుమార్‌ సాయిని ఎలిమినేట్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

నేటి ఎపిసోడ్‌ లో కుమార్‌ సాయి ఎలిమినేట్‌ అవ్వబోతున్నాడని ముందే లేక్‌ అయ్యింది. శనివారం రోజే కుమార్‌ సాయి ఈ వారం ఎలిమినేట్‌ అవ్వబోతున్నట్లుగా కథనం ఇచ్చాం. అన్నట్లుగానే కుమార్‌ సాయి ఎలిమినేట్‌ అయ్యాడు. అయితే ఎలిమినేషన్‌ లో కాస్త ట్విస్ట్‌ ఇచ్చారు. ఒకొక్కరిని సేవ్‌ చేస్తూ వచ్చిన నాగార్జున చివర్లో కుమార్‌ సాయి మరియు మోనాల్‌ లు ఉండగా ఇద్దరు కూడా బ్యాగ్‌ సర్దేసుకుని కన్ఫెషన్‌ రూంలోకి వచ్చేయండి అంటూ చెప్పారు. కన్ఫెషన్‌ రూంలోకి ఇద్దరు వెళ్లడంతో ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యి ఉంటారా అంటూ ఇంటి సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోనాల్‌ ఎలిమినేట్‌ అయ్యిందేమో అని అఖిల్‌ చాలా బాధపడ్డాడు. అతడు కన్నీరు పెట్టుకున్నాడు. మోనాల్‌ ను కన్ఫెషన్‌ రూంకు వెళ్లమని చెప్పిన సమయంలో అతడు ఆశ్చర్యపోయాడు.

కన్ఫెషన్‌ రూమ్‌ లో కొద్ది సేపు సస్పెన్స్‌ తర్వాత నాగార్జున కుమార్‌ సాయి ఎలిమినేట్‌ అంటూ ప్రకటించాడు. మోనాల్‌ కొద్ది సమయం కన్ఫెషన్‌ రూంలోనే ఉండు అంటూ కుమార్‌ సాయిని స్టేజ్‌ పైకి పిలిచాడు. స్టేజ్‌ పై కుమార్‌ సాయిని చూసిన ఇంటి సభ్యులు మోనాల్‌ ఏమై ఉంటుంది అనుకున్నారు. స్టేజ్ పైకి వెళ్లిన కుమార్‌ సాయి తనకు ఇచ్చిన కూరగాయలతో ఇంట్లోని వారిని పోల్చాడు. మొదట ఉల్లి గడ్డ అంటూ అరియానాను గంగవ్వ పదే పదే అనేది అందుకే అరియానా ఉల్లిగడ్డ అంది. నాగార్జున గారు అన్నారు అంటూ ఆటలో అరటి పండు అవినాష్ అన్నాడు. కరివేపాకు అఖిల్‌ అన్నాడు. ఆ సమయంలో అఖిల్‌ సీరియస్ అయ్యి నేను ఆడాను ఇక్కడ ఉన్నా నీవు ఆడావు అక్కడ ఉన్నావు అంటూ నాగార్జున ముందే అనేశాడు. అలా ఒకొక్కరికి ఒక్కో కూరగాయను ఇచ్చి చివరకు వెళ్లి పోయే ముందు ఒక డాన్స్‌ చేశాడు. కుమార్‌ డాన్స్‌ చేస్తున్న సమయంలో కన్ఫెషన్‌ రూం నుండి మోనాల్‌ హౌస్‌ లోకి వచ్చింది. ఆమె వచ్చిన వెంటనే అంతా ఆశ్చర్యపోయి ఆమెను వెల్‌ కం చేశారు.

ఇక ఎలిమినేషన్‌ కు ముందు సండే ఫన్‌ డే లో భాగంగా చాలా రకాల ఆటలను నాగార్జున ఇంటి సభ్యులతో ఆడించారు. డాన్స్‌ చేయించారు. ఆటలకు నోయల్‌ జడ్జ్‌ గా వ్యవహరించగా డాన్స్‌ కు అమ్మ రాజశేఖర్‌ జడ్జ్‌ గా వ్యవహరించాడు. మొత్తానికి ఆదివారం ఎపిసోడ్‌ అలా అలా ఎంటర్‌ టైన్‌మెంట్‌ ను ఎమోషన్‌ ను పంచింది. రేపటి నుండి ఏడవ వారంలోకి షో అడుగు పెట్టబోతుంది. రేపటి ఎపిసోడ్‌ లో నామినేషన్ పక్రియ జరుగబోతుందని ప్రోమోలో చూపించారు. ఇక ఏడవ వారంలో ఎవరు నామినేట్‌ అవ్వబోతున్నారో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...