Switch to English

రామోజీ ఫిలింసిటీ గాసిప్స్‌పై వివరణ సరే.. ఈనాడు మాటేమిటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘రామోజీ ఫిలిం సిటీని అమ్మేస్తున్నారట.. రామోజీ ఫిలిం సిటీని వదిలించేసుకుంటున్నారట.. రామోజీ ఫిలింసిటీని అద్దెక్కిచ్చేస్తున్నారట.. రామోజీ ఫిలింసిటీని లీజుకిచ్చేస్తున్నారట.. రామోజీరావు పనైపోయినట్లే.. కరోనా దెబ్బకి రామోజీ ఆర్థికంగా చితికిపోయారు..’ అంటూ కుప్పలు తెప్పలుగా సోషల్‌ మీడియాలోనూ, వెబ్‌ మీడియాలోనూ కథనాలు పుట్టుకొచ్చాయి గత కొద్ది రోజులుగా. ఇంతకీ ఏది నిజం.? అంటే, ‘ఇదిగో ఇదీ నిజం..’ అంటూ ఓ వివరణ బయటకు వచ్చింది.

కొన్ని ప్రముఖ సంస్థలకు (జీ, సోనీ) రామోజీ ఫిలింసిటీలో షూటింగుల కోసం ప్రత్యేకంగా వెసులుబాట్లు కల్పించారట. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ ఏ స్థాయిలో నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక, రామోజీ ఫిలిం సిటీ విషయానికొస్తే, నిత్యం వందలాది మంది.. వేలాదిమంది సందర్శకులు ఈ ఫిలింసిటీని సందర్శిస్తుంటారు.. నిత్యం షూటింగులు జరుగుతుంటాయి. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ ఫిలింసిటీపైన కూడా పడిన మాట వాస్తవం.

ఈ నేపథ్యంలో ‘ఉభయతారకంగా’ అన్నట్లు, ఫిలింసిటీలో ఆయా సంస్థలకు షూటింగుల కోసం కొన్ని వెసులుబాట్లు కల్పించారు. తద్వారా యాక్టివిటీ పెరుగుతుంది.. సితార వంటి హోటల్స్‌లో ఆతిథ్యం ఎలాగూ ఖరీదైనది కాబట్టి.. ఆదాయం దండిగా సమకూరుతుంది. షూటింగ్‌కి అవసరమైన సాంకేతిక సహాయం (ఎక్విప్‌మెంట్‌) అద్దెకు తీసుకోవాలి కాబట్టి.. అదీ ఫిలింసిటీకి లాభమే. ఇదీ రామోజీ ఫిలింసిటీ వ్యవహారం. ఎలాగైతేనేం, ఫిలింసిటీపై పుకార్లకు చెక్‌ పడింది. మంచి విషయమే ఇది.

కానీ, ఈనాడు సంస్థలో ఉద్యోగుల తొలగింపు వ్యవహారమేమిటి.? కిందిస్థాయి ఫీల్డ్‌ స్టాఫ్‌ని రెండు మూడు నెలల నుంచి ఇంటికే పరిమితం చేసిన ఈనాడు సంస్థ, వారిని పూర్తిగా తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుందట.. అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతమంది కీలకమైన సిబ్బందికి కూడా లే-ఆఫ్‌ ప్రకటించిందట సంస్థ. ఈ విషయమై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ‘ఈనాడు బాధితులు’ అంటూ కొందరు సోషల్‌ మీడియాలో ఈనాడుకి సంబంధించిన అంతర్గత విషయాల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈనాడుకి పాఠకులు గణనీయంగా తగ్గిపోయారు. అన్ని పత్రికలదీ ఇదే పరిస్థితి. అయితే, మూడు నాలుగు నెలలకే ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయేలా పెద్ద పెద్ద సంస్థలు వుంటాయా.? బలమైన పునాదుల మీద ఏర్పడ్డ ఓ ‘సామ్రాజ్యం’గా మీడియా సంస్థల్ని అభివర్ణిస్తుంటారు. మరి, ఈ గాసిప్స్‌ మాటేమిటి.? ఈ గాసిప్స్‌పై ఈనాడు సంస్థ ఇంతవరకు ఎందుకు స్పందించలేదు.? అన్నది చాలామంది ప్రశ్న.

ఏమో, రామోజీ ఫిలింసిటీపై వివరణ వచ్చినట్లే, ఈనాడు చుట్టూ విన్పిస్తున్న గాసిప్స్‌పైనా స్పందన త్వరలోనే వస్తుందేమో.! ఏదిఏమైనా, ఈనాడు యాజమాన్యం కరోనా పేరు చెప్పి, తమకు అన్యాయం చేస్తోందని ఈనాడు ఉద్యగోలు గగ్గోలు పెడుతున్నట్లు గత రెండు మూడు నెలలుగా మీడియా వర్గాల్లో రచ్చ జరుగుతున్నా లేని స్పందన.. రామోజీ ఫిలిం సిటీపై గాసిప్స్ రాగానే ఆగమేఘాల మీద రావడం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...