Switch to English

నిజంగానే ‘కాపు’కాస్తున్నారా.? జగన్‌ సర్కార్‌ని నిలదీసిన పవన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ‘కులం’ చుట్టూనే రాజకీయాలు జరుగుతున్నాయి.. ‘మతం’ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు నడుస్తున్నాయి. అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్సీపీ)తోపాటు, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. పబ్లిసిటీ స్టంట్స్‌లో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారన్నది నిర్వివాదాంశం. ఇక, ఎన్నికల వేళ ‘కాపు’ ఓటు బ్యాంకు కోసం టీడీపీ, వైసీపీ పడరాని పాట్లూ పడ్డాయి. ఈ క్రమంలో ‘కాపు కార్పొరేషన్‌’ చుట్టూ చాలా ఆసక్తికరమైన చర్చ, ఎన్నికల తాయిలాలు చూశాం.

కాపు కార్పొరేషన్‌కి చంద్రబాబు సర్కార్‌ ఏటా వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు చెబితే, తాము అధికారంలోకి వచ్చాక 2000 కోట్లు ఇస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చెప్పారు. మరి, అధికారంలోకి వచ్చాక.. మాట నిలబెట్టుకున్నారా.? అంటే, మాట ఇచ్చినదాని కంటే ఎక్కువ నిధులు కాపు కార్పొరేషన్‌కి ఇచ్చామని జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయమై జనసేనాని పవన్‌ కళ్యాణ్‌, జగన్‌ సర్కార్‌ని సూటిగా ప్రశ్నించారు.

కాపు కార్పొరేషన్‌కి జగన్‌ సర్కార్‌ కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్‌ చేశారు. నిజానికి కాపు కార్పొరేషన్‌కి ప్రభుత్వం కేటాయించామంటోన్న నిధుల్లో, వివిధ పథకాల్ని జోడించారు. ఆ పథకాల్లో చాలావరకు కులమతాలకతీతంగా అందరికీ చేరుతున్నవే. ఇందులో ప్రత్యేకంగా కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వం కేటాయించింది ఏంటి.? అన్నది కీలకమైన విషయం. కాపు సామాజిక వర్గంలో ఇప్పుడు ఈ విషయమై చర్చ జరుగుతోంది కూడా.

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ వాహన మిత్ర, వైఎస్సార్‌ జగనన్న చేదోడు, జగనన్న తోడు.. ఇలా పలు పథకాల్ని కలుపుకుంటే మొత్తంగా 2845 కోట్ల రూపాయల్ని ‘కాపు కార్పొరేషన్‌’ లెక్కల్లో ప్రభుత్వం చూపుతుండడాన్ని కాపు సామాజిక వర్గ పెద్దలు తప్పు పడ్తున్నారు. ఎన్నికల సమయంలో కాపు కార్పొరేషన్‌కి 2 వేల కోట్ల నిధులు ఇస్తామని చెప్పిన వైఎస్‌ జగన్‌, ఇప్పుడు మాట తప్పారంటున్నారు వారంతా. అధికార పార్టీ చేస్తోన్న ఈ పబ్లిసిటీ స్టంట్లు కులాల మధ్య చిచ్చు రేపేలా వుందని జనసేనాని వ్యాఖ్యానించారు.

కాపు సామాజిక వర్గం డిమాండ్‌ చేస్తోన్న రిజర్వేషన్ల అంశాన్ని తొక్కి పెట్టి, ఈ పబ్లిసిటీ స్టంట్స్‌తో కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారా.? అని జనసేనాని నిలదీశారు ప్రెస్‌నోట్‌ ద్వారా. ఇప్పుడు ఈ ప్రెస్‌నోట్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

19 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...