Switch to English

అబ్జర్వేషన్‌: దేశంలో ‘కరోనా’ లెక్కల్లో చిత్తశుద్ధి ఎంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌.. ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి ఇది. ప్రపంచ యుద్ధం కంటే భయానకంగా మారుతోంది ఈ మహమ్మారి. నిజమే, కరోనా వైరస్‌ నుంచి అగ్రరాజ్యం అమెరికా కూడా తప్పించుకోలేకపోయింది. ఆ మాటకొస్తే, అత్యంత దారుణంగా కరోనా దెబ్బకి విలవిల్లాడుతున్నది అగ్రరాజ్యమే. అలాంటిది, మన దేశంలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో ప్రకంపనలు సృష్టించడంలో వింతేముంది.?

అయితే, మన దేశంలో కరోనా లెక్కలు పక్కాగా వుంటున్నాయా.? లేదా.? అన్న అనుమానాలు మాత్రం రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. లెక్కలు.. అంటే, కేసుల సంఖ్య గురించి కాదు. ఏ రాష్ట్రం కరోనా విషయంలో ఎలా స్పందిస్తోంది.? అసలు కేంద్ర ప్రభుత్వం, కరోనాపై పోరులో తీసుకుంటున్న చర్యలు సబబేనా.? వంటివన్నమాట. కరోనా లక్షణాలివీ.. కరోనాని ఇలా అరికట్టగలం.. అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలానే చెబుతున్నాయి.

అయితే, కరోనా వైరస్‌ విషయమై ఇప్పటికీ ప్రపంచం ఓ అవగాహనకు రాలేకపోతోందన్నది నిర్వివాదాంశం. లాక్‌డౌన్‌ ఒక్కటే కరోనా వైరస్‌ని అరికట్టడానికి మార్గమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబితే.. జనం దాన్ని పాటిస్తున్నారు. వందలో ఒక్కడు లైట్‌ తీసుకున్నా, పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోతుంది ఇలాంటి విషయాల్లో. ఇక్కడ ఇదే జరుగుతోంది. 14 రోజుల క్వారంటైన్‌ ఇకపై 28 రోజులకు మారింది తెలంగాణలో. ఇది కరోనా వైరస్‌పై కొత్త అనుమానాల్ని రేకెత్తిస్తోంది.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందు పనిచేయడంలేదన్న చర్చ తెరపైకొచ్చింది. కరోనా వైరస్‌ పట్ల మనకి పూర్తి అవగాహన లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? మనవంతుగా మనం ప్రయత్నిస్తున్నాం. ఇందులో ఎవర్నీ నిందించడానికి వీల్లేదు. అయితే, మనం ‘లాక్‌ డౌన్‌’ నుంచి బయటపడి, కరోనా వైరస్‌ని ఎప్పుడు ‘లాక్‌’ చేయగలం.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

దేశంలో ఇప్పటికే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20 వేలకు దాటిపోయింది. మరణాల సంఖ్య కొద్ది రోజుల్లోనే వెయ్యికి చేరుకోవచ్చు. ఆ పాటికి కేసుల సంఖ్య ఏ 30 వేలకు చేరుకుంటుందో ఏమో.! కొన్ని రాష్ట్రాలు ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌.. అంటూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కరోనాపై పోరాటం కంటే, అధికార పార్టీకి రాజకీయమే ముఖ్యమైపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ప్రజలకు ఆందోళన కలగకుండా ఎలా వుంటుంది.? మే 3తో లాక్‌డౌన్‌ ముగియాల్సి వుంటుంది. ముగుస్తుందా.? లేదా.? ఈ నెల 27న ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించబోతున్నారట. ఏమో, ఆ రోజు మోడీ ఏం బాంబు పేల్చుతారోనన్న భయం సగటు భారతీయుల్లో స్పష్టంగా కన్పిస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...