అటు శర్వానంద్ కానీ ఇటు సాయి పల్లవి కానీ ఇద్దరికీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ లుగా పేరుంది. ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమా పడి పడి లేచే మనసు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. అయితే ఈ ఇద్దరి పెర్ఫార్మన్స్ లకు, వీరి మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. దర్శకత్వ లోపం వల్ల, అతిగా ఖర్చు పెట్టడం వల్ల పడి పడి లేచే మనసు వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ జోడి మరోసారి కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం అనే రైతుల సబ్జెక్ట్ పై తెరకెక్కుతోన్న సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా సమ్మర్ కు విడుదల కానుంది. దీని తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ ప్రస్తుతం ఈ సినిమా స్టేటస్ ఏంటో తెలీదు. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఈ సినిమా షూటింగ్ మే లేదా జూన్ నుండి మొదలుకావచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. కిషోర్ తిరుమల ప్రస్తుతం రామ్ తో రెడ్ సినిమాను తీస్తున్నాడు. ఆ సినిమా ఏప్రిల్ 9న విడుదల కాగా దాని తర్వాత శర్వానంద్ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమాను లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
658291 918119Oh my goodness! an superb article dude. Thank you Nevertheless Im experiencing issue with ur rss . Do not know why Cannot register for it. Could there be any person finding identical rss difficulty? Anybody who knows kindly respond. Thnkx 120138
880756 137635The next time I just read a weblog, I actually hope which it doesnt disappoint me up to this one. Get real, Yes, it was my choice to read, but I personally thought youd have something fascinating to convey. All I hear can be a handful of whining about something you can fix in the event you werent too busy trying to discover attention. 140411
151262 685363Id always want to be update on new articles on this internet internet site , saved to favorites ! . 292393