సినిమాల్లో చాలా బిజీ అవుతున్న జాన్వీ కపూర్, పెళ్ళి విషయమై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పెళ్ళి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలోనే జరుగుతుందని ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ. అప్పుడే జాన్వీ, తన పెళ్ళి గురించి ఎందుకు మాట్లాడుతున్నట్లు.? అంటే, దానికీ ఓ పెద్ద కథ వుంది. మరీ పెద్దదేమీ కాదు, చిన్న కథే. ఓ సందర్భంలో ఆమెపైకి ‘మీ పెళ్ళెప్పుడు.?’ అని మీడియా నుంచి ఓ రొటీన్ ప్రశ్న దూసుకొచ్చింది.
‘అప్పుడే నాకు పెళ్ళేంటి.?’ అని పరమ రొటీన్ ఆన్సర్ ఇవ్వకుండా, జాన్వీ కపూర్ పై విధంగా చెప్పి షాకిచ్చింది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా వున్నాననీ, పెళ్ళంటూ జరిగితే అది తిరుమలలోనేనని చెప్పిన జాన్వీ కపూర్, ఇప్పటికైతే వరుడి గురించిన ఆలోచన కూడా ఏమీ లేదని తేల్చేసింది. జాన్వీ తల్లి శ్రీదేవి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఇప్పటికీ శ్రీదేవి బంధువులు చిత్తూరు జిల్లాలో వున్నారు. వీలు కుదిరినప్పుడల్లా శ్రీదేవి, తన బంధువుల్ని కలిసేందుకు చిత్తూరుకి వస్తూ వుండేది.
Also Read: జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ.. విజయ్ దేవరకొండతోనా.?
శ్రీదేవి మాత్రమే కాదు, బోనీ కపూర్ కూడా చిత్తూరు జిల్లాకి వచ్చి వెళుతుండేవాడు. శ్రీదేవి అకాల మరణంతో చిత్తూరులో ఆమె బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంగతి పక్కన పెడితే, ఇటీవల జాన్వీ కపూర్, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది.. అదీ తెలుగందం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తుల్లో.
పదహారణాల తెలుగమ్మాయిలా జాన్వీ కపూర్ కనిపించేసరికి చాలామంది అవాక్కయ్యారు. కొందరు ఆమెని గుర్తుపట్టలేకపోయారు కూడా. ఏదిఏమైనా, ఇప్పుడు జాన్వీ కపూర్ పెళ్ళి వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. జాన్వీ తన పెళ్ళి విషయమై ఇంత చక్కటి అవగాహనతో వుందంటే, వరుడెవరో కూడా ఆమె డిసైడ్ అయిపోయి వుంటుదంటూ బాలీవుడ్ మీడియా కథనాల్ని వండి వడ్డించేస్తోంది.
665277 881061Id constantly want to be update on new content material on this internet site, bookmarked! 44899
507253 128963You may be websites successful individuals, it comes effortlessly, therefore you also earn you see, the jealousy of all of the ones lots of journeymen surrounding you can have challenges within this challenge. motor movers 398884