Switch to English

బులుగు రాజకీయం: చిరంజీవిని అవమానించి.. బాలయ్యపై ప్రేమ కురిపించి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమ తరఫున, పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పదే పదే విజ్ఞప్తులు చేస్తే, వాటి పట్ల ఇంతవరకు సానుకూల స్పందన రాలేదు. ఆ ప్రయోజనాల వల్ల చిరంజీవి వ్యక్తిగతంగా లాభపడేది ఏమీ వుండదని, ‘భీమ్లానాయక్’ ఉదంతంతో తేటతెల్లమైపోయింది.

అయినా, చిరంజీవి పరిశ్రమ తరఫున ‘బాధ్యత’ తీసుకున్నారు. ఆ బాధ్యతని కూడా గేలి చేసే కుహనా మేధావులు సినీ, రాజకీయ వర్గాల్లో వున్నారనుకోండి.. అది వేరే సంగతి. చిరంజీవి చేతులు జోడించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘సాయం’ కోరారు.. పరిశ్రమ కోసం. మహేష్, ప్రభాస్ తదితరులూ ఈ భేటీలో పాల్గొన్నారు.

అలా చిరంజీవిని తన దగ్గరకు రప్పించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చిత్రంగా నందమూరి బాలకృష్ణను మాత్రం రప్పించుకోలేదు. ‘అఖండ’ సినిమాకి ప్రత్యేక వెసులుబాట్లు కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆ చిత్ర నిర్మాతలు సంప్రదింపులు జరిపారట. దీనికి ఓ వైసీపీ ఎమ్మెల్యే మద్యవర్తిత్వం వహించారట. మంత్రి పేర్ని నాని స్వయంగా ఈ విషయం వెల్లడించారు. అయితే, ‘అఖండ’కి ఇచ్చిన వెసులుబాట్లు ఏంటన్నది మాత్రం బయటపెట్టలేదు.

బాలయ్య స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుస్తానని చెప్పారట. కానీ, ‘ఆయన్ని అగౌరవ పరిచినట్లవుతుంది.. ఆయనకు ఏం కావాలో అవి చేసి పెట్టండి..’ అని సీఎం జగన్, మంత్రి పేర్ని నానికి సూచించారట. అంటే, తెరవెనుకాల ఏదో ‘సాయం’ బాలయ్య ‘అఖండ’ సినిమాకి అందినట్టే కదా.?

బాలకృష్ణ విషయంలో చూపిన ఈ అభిమానం, ప్రేమ, గౌరవం.. చిరంజీవి సహా మహేష్, ప్రభాస్ తదితరుల విషయంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎందుకు చూపలేకపోయారట.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

నిర్మాతలు తమ తమ సినిమాల విషయమై, మద్యవర్తుల ద్వారా ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపితే.. అది గౌరవ ప్రదమా.? అది తెరచాటు వ్యవహారం కదా.! అన్న ప్రశ్న తలెత్తుతోంది. పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ పెద్దల ‘వింత చూపు’ ఇప్పుడందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...