అమరావతి అభివృద్ధికి మొదటి దశలో రూ. 3వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. వివిధ బ్యాంకుల కన్సార్షియం నుంచి బ్యాంక్ రుణాలు తెచ్చుకునేందుకు అనుమతిచ్చింది. అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీఏ) పరిధిలో మొదటి దశలో మౌళిక సదుపాయాలు, ల్యాండ్ పూలింగ్ పథకం, లేఅవుట్ల అభివృద్ధి పనులకు కు ఆమోదం లభించింది.
ఈ నేపథ్యంలో మూడు బ్యాంకులు.. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్లు రూ. వెయ్యి కోట్ల చొప్పున రుణం ఇచ్చేందుకు అంగీకరించినట్లు ఏఎం ఆర్డీయే కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. రుణంతోపాటు వడ్డీ కూడా ఏఎంఆర్డీఏ చెల్లించుకోవాలని ప్రభుత్వం షరతుల్లో పేర్కొంది.
అమరావతి అభివృద్ధికి గత ప్రభుత్వ అంచనా వ్యయం రూ. 29.282 కోట్లను సీఎం జగన్ మూడో వంతుకు తగ్గించారు. ఇందుకు తగినట్టుగా వ్యయాన్ని కుదిస్తూ ఏఎంఆర్డీయే గతంలోనే అంచనాలను సవరించింది. 10వేల కోట్లకు ప్రభుత్వం పూచీకత్తు ఇస్తే రుణంగా మూడు దశల్లో ఇస్తామని మూడు ప్రభుత్వరంగ బ్యాంకుల కన్సార్షియం పేర్కొంది.
512040 506890I dont think Ive scan anything like this before. So great to uncover somebody with some original thoughts on this topic. thank for starting this up. This website is something that is needed on the web, someone with a bit originality. Excellent job for bringing something new to the internet! 507334
872070 32023I visited lots of website but I conceive this one contains something special in it in it 941727