పలు చోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) మొరాయింపులు.. అక్కడక్కడా ఉద్రిక్తత పరిస్థితులతో ఆంధ్రప్రదేశ్ లో గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల పోలింగ్ ప్రశాంతంగానే సాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. అయితే, ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంతో కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రత పెరగకుండానే ఓటు వేసి వెళ్లిపోదామని వచ్చిన వారంతా ఈవీఎంల మొరాయింపుతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
మరోవైపు పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించకపోవడంతో వాటిని ఎక్కడ భద్రపరచాలో తెలియక పలువురు ఇబ్బంది పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 45,000 ఈవీఎంలను వినియోగిస్తుండగా, స్వల్ప సాంకేతిక కారణాలతో 372 ఈవీఎంలు పనిచేయలేదని, వాటిని సరిచేసి పోలింగ్ కొనసాగిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్ ఆలస్యమైనప్పటికీ, సమయం మాత్రం పెంచడం కుదరదని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఇది ఓటింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 157 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈవీఎంలు పనిచేయకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 శాతం ఈవీఎంలు పనిచేయడంలేదని, ఫలితంగా పోలింగ్ ఆలస్యమవుతోందని, ఈసీ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కొన్నిచోట్ల తెలుగుదేశానికి ఓటేస్తుంటే వైఎస్సార్ సీపీకి ఓటు పడుతోందనే ఆరోపణలు వస్తున్నాయని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. కాగా, మంగళగిరిలో ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విషయంపై అధికారులను అడిగినా సరిగా స్పందించలేదని విమర్శించారు. అధికారుల వైఖరికి నిరసనగా ఆయన పోలింగ్ కేంద్రం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పోలింగ్ ప్రారంభమై మూడు గంటలు దాటినా ఈవీఎంల లోపాన్ని సరిదిద్దకపోవడంపై కుట్రకోణం ఉందేమోనని అనుమానం వ్యక్తంచేశారు. వైఎస్సార్ సీపీకి ఓట్లు పడేచోట ఈవీఎంలు పనిచేయకుండా చేశారన్నారు.
మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యలమందలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అలాగే కడప జిల్లా జమ్మలమడుగులో కూడా అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తిలో సాక్షాత్తు జనసేన పార్టీ అభ్యర్ధే ఈవీఎం ధ్వంసం చేశారు. అక్కడ జనసేన నుంచి బరిలో నిలిచిన మధుసూదన్ గుప్తా ఈ చర్యకు పాల్పడ్డారు. పోలింగ్ ఏర్పాట్లు సరిగా చేయలేదని ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగిన ఆయన.. అక్కడున్న ఈవీఎం యంత్రాన్ని నేలకేసి కొట్టారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తమ్మీద అక్కడక్కడా ఇలాంటి ఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగానే సాగుతోంది. అయితే, ఎండ తీవ్రత, ఈవీఎంల సమస్యల కారణంగా కొన్నిచోట్ల ఆలస్యంగా ఓట్లు పోలవుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు లైనులో ఉన్నవారికి ఓటేసే అవకాశం ఉంటుందని, అందువల్ల అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఈసీ పేర్కొంది.
870541 222793Get started with wales ahead almost every planking. Ones wales truly are a compilation of huge planks one certain depth advisors definitely is the identical towards the entire hull planking nonetheless with even larger density to successfully thrust outward beyond the planking. planking 401539
917099 869171Aw, this was a truly nice post. In concept I wish to put in writing like this moreover ?taking time and actual effort to make an superb write-up?nevertheless what can I say?I procrastinate alot and by no means appear to get something done. 961763
38760 77615Glad to be 1 of several visitants on this awful web site : D. 59494
646810 301048Ive applied the valuable points from this page and I can undoubtedly tell that it gives plenty of assistance with my present jobs. I would be very pleased to maintain getting back in this web page. Thank you. 739085