రాజకీయ నాయకులను కూడా కరోనా వదలడం లేదు. దేశంలో కరోనా విజృంభిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. తాజాగా కరోనా కారణంగా రాష్ట్ర అసెంబ్లీ కార్యక్రమాలను ఆరు బయట నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమం ఆరు బయట జరగడం చర్చనీయాంశం అయ్యింది. కరోనా కారణంగా బడ్జెట్ సమావేశాలు ఇలా బయట నిర్వహించారు స్పీకర్.
పుదుచ్చేరికి చెందిన ఎమ్మెల్యే జయబాల్ కరోనా పాజిటివ్ అంటూ తాజాగా నిర్థారణ అయ్యింది. ఇటీవల ఆయన అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో ఆందోళన కూడా చేశారు. అంత చేసిన ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో ఆయనతో నేరుగా కాంటాక్ట్ అయిన ఎమ్మెల్యేలు స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయారు.
మిగిలి ఉన్న వారితో ఆరు బయట బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. మరో వైపు అసెంబ్లీ హాల్ ను దశల వారిగా శానిటైజేషన్ చేయడం జరిగింది. దేశ చరిత్రలో మొదటి సారి అసెంబ్లీ కార్యక్రమాలు ఆరు బయట నిర్వహించడం పుదుచ్చేరిలో అదీ కరోనా కారణంగా జరిగింది. కరోనా వల్ల మరెన్ని వింతలు జరుగుతాయో చూడాలి.