అక్రమ సంబంధం మోజులో ఆమె లేదా ఆయన ఎంతటి పనికి అయినా తెగిస్తారని నిర్థారణ అయ్యింది. ఈమద్య కాలంలో భార్యలు అక్రమ సంబంధాలు నెరిపేందుకు భర్త అడ్డుగా ఉంటున్నాడు అంటూ అత్యంత కఠినంగా దారుణంగా చంపడం హత్య చేయించడం జరుగుతుంది. ఈ పరిణామాలు తల్చుకుంటేనే అలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరుకు చెందిన బ్రహ్మయ్య హత్యకు గురయ్యాడు. ఆయన హత్య కేసును గత 15 రోజులుగా ఎంక్వౌరీ చేస్తున్న పోలీసులకు ఆశ్చర్యకర విషయం తెలిసింది.
బ్రహ్మయ్యను చంపింది వేరే వారు అయినా చంపించింది మాత్రం ఆయన భార్య సాయి కుమారి అంటూ నిర్థారణ అయ్యింది. ఆమె అశోక్ రెడ్డితో తాను నెరుపుతున్న అక్రమ సంబంధంకు అడ్డుగా వస్తున్నాడనే ఉద్దేశ్యంతో ఏకంగా 10 లక్షల రూపాయలను సుపారిగా ఇచ్చి తమ పైకి హత్య నేరం రాకుండా ఉండేలా జాగ్రత్త పడి బ్రహ్మయ్య భార్య మరియు ఆమె ప్రియుడు రోల్డ్ గోల్డ్ ఆభరణాలు చేసేందుకు ఉపయోగించే సైనెడ్ తో బ్రహ్మయ్యను చంపించారు అంటూ పోలీసుల ఎంక్వౌరీలో వెళ్లడయ్యింది. హంతకులు ఇద్దరితో పాటు సాయి కుమారి మరియు ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
187095 589297Very great publish, thanks a good deal for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 674412