ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాజకీయంగా కలకలం రేపే సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. సర్పంచి పదవికి నామినేషన్ వేసిన టీడీపీ కి చెందిన అభ్యర్ధి భర్త అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలకుంట గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన సబ్బెళ్ల శ్రీనివాస రెడ్డి తన భార్య పుష్పవతితో టీడీపీ తరపున సర్పంచి అభ్యర్ధిగా నిన్న నామినేషన్ వేయించారు.
అయితే.. నామినేషన్ అనంతరం శ్రీనివాసరెడ్డిని కొందరు గుర్తు తెలియని దుండగులు అపహరించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి కాళ్లు, చేతులు కట్టేసి సమీపంలోని అటవీప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాసరెడ్డిని నిన్న విచారించారు. ఈరోజు మరోసారి విచారించారు. అయితే.. ఈరోజు సాయంత్రం గ్రామంలోని ఓ పొలంలో శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు విచారించిన కాసేపటికే శ్రీనివాసరెడ్డి ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.
647616 906734I dont think Ive read anything like this before. So excellent to locate somebody with some original thoughts on this subject. thank for starting this up. This site is something that is necessary on the web, someone with a bit originality. Great job for bringing something new towards the internet! 561221
541558 162422Perfect just what I was looking for! . 380298
937500 493365HURRAY! cant balladeer. by virtue of himself by what name highly. 541558