నిర్మల్ జిల్లాలోని బాసరలో ఆర్జీయూకేటీ లో విద్యార్ధుల ఆందోళన రెండు రోజులుగా కొనసాగుతోంది. యూనివర్శిటీలో నెలకొన్న పరిస్థుతులపై విద్యార్ధులు మంగళవారం చేపట్టిన ఆందోళన బుధవారం కూడా కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ ఇక్కడికి వచ్చి సమస్యలపై స్పందించే వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. సుమారు 6వేల మంది విద్యార్ధులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
యూనివర్శిటీలో సౌకర్యాల లేమి, సామాగ్రి సరఫరాలో యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, రాష్ట్రావిర్భావం నుంచీ శాస్వత వీసీ నియామకం చేపట్టకపోవడం, మూడేళ్లుగా ల్యాప్ టాప్ లు, యూనిఫాం సరఫరా లేకపోవడం, నాణ్యమైన భోజనం పెట్టకపోవడంపై వారు ఆందోళనలకు దిగారు. మెయిన్ గేట్ వద్ద బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నారు.
పెద్ద సంఖ్యలో విద్యార్ధులు నిరసన తెలపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్ధులు చేస్తున్న ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ప్రభుత్వ స్పందనేంటో తెలియాల్సి ఉంది.
987417 563399Wow Da weiss man, wo es hingehen muss Viele Grsse Mirta 561166
156253 344541You produced some decent points there. I looked online for the issue and located many people may go as properly as employing your internet web site. 213851
447955 477509Thank her so significantly! This line is move before dovetail crazy, altarpiece rather act like habitual the economizing – what entrepreneur groovy night until deal with starting a trade. 704814