ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషయంలో ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కొత్త వీడియోను విడుదల చేశారు. ఈనెల 16వ తారీకున వీడియోను విడుదల చేసిన చరణ్ మూడు రోజుల తర్వాత మరో వీడియోలో బాలు ఆరోగ్య విషయమై క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఐసీయూలోనే బాలు గారు ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇంకా ఎక్మో వెంటిలేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేవు. అయినా కూడా మరింత సులభంగా శ్వాస తీసుకునే వరకు ఆయన వెంటిలేషన్ ఉంటుందని వైధ్యులు చెబుతున్నారు.
రోజులో 15 నుండి 20 నిమిషాల పాటు నాన్న వైధ్యుల సాయంతో లేచి కూర్చుంటున్నారు. అలాగే ఫిజియో థెరఫీ కూడా చేస్తూ ఉన్నారు. నాన్న నేటి నుండి ఆహారం కూడా తీసుకుంటున్నారు. ఆయన ఆహారం తీసుకోవడంతో మరింత స్పీడ్గా రికవరీ అవుతాడని భావిస్తున్నాం. మీ అందరి ప్రార్థనలు మరియు ఆశీస్సుల వల్ల నాన్న ఆరోగ్యం మెరుగు పడింది. ఇక ఆసుపత్రి వైధ్యులు మరియు నర్స్ ల సాయం కూడా ఎంతో ఉంది. మీరు వారు అందరి వల్ల నాన్న తిరిగి కోలుకుంటున్నారు. త్వరలోనే నాన్న సాదారణ వార్డ్కు వస్తారు అంటూ చరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
259173 733743 Nice post. I learn something more challenging on different blogs everyday. It will always be stimulating to read content material from other writers and practice just a little something from their store. Id prefer to use some with the content on my weblog whether you dont mind. Natually Ill give you a link on your internet blog. Thanks for sharing. 188317
680801 159079Wonderful write-up mate, maintain the great function, just shared this with ma friendz 794719