ప్రముఖ సినీనటుడు సోనూసూద్ మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. లాక్ డౌన్ సమయంలో అష్టకష్టాలు పడుతున్న ఎందరో అభాగ్యులకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్న ఆయన.. తర్వాత కూడా కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ వస్తున్నారు.
తాజాగా ఓ చిన్నారి వైద్యచికిత్సకు అవసరమైన మొత్తాన్ని అందజేయడానికి ముందుకొచ్చారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గోవింద్ పల్లికి చెందిన కనకం సుమన్, ఉషాశ్రీ దంపతుల కుమారుడు అన్విక్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఇప్పటివరకు అతడి తల్లిదండ్రులు ఉన్నదంతా ఖర్చుపెట్టి చికిత్స చేయించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని రెయిన్ బో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బోన్ మ్యారో చికిత్స చేయాలని, రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు.
దీంతో సోనూసూద్ సేవల గురించి తెలుసుకుని ఆయనకు తమ దీనస్థితి వివరిస్తూ మెసేజ్ పంపించారు. వెంటనే స్పందించిన సోనూ.. ఆస్పత్రికి వెళ్లి అక్కడ నుంచి తనకు ఫోన్ చేయించాలని సూచించారు. వైద్యఖర్చులో కొంత మొత్తం తాను భరిస్తానని భరోసా ఇచ్చారు.
219754 711416A extremely informationrmative post and lots of actually honest and forthright comments created! This definitely got me thinking a good deal about this issue so cheers a whole lot for dropping! 655283
921870 798904Wow What excellent information. Thank you for the time you spent on this post. 755228