జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో వారాహి విజయ యాత్ర సందర్భంగా, వైఎస్ జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రూపాయి పావలా ముఖ్యమంత్రిగా అభివర్ణించిన జనసేనాని, వైసీపీ ప్రభుత్వాన్ని రూపాయి పావలా ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.
నెల్లూరులో నా చిన్నప్పుడు రూపాయి పావలా బొమ్మల పేరుతో కొందరు వ్యాపారం చేసేవారనీ, రూపాయి పావలా దాచుకుని వెళితే.. అక్కడ ఆ ధరకి ఒక్క బొమ్మ కూడా దొరికేది కాదనీ, వైఎస్ జగన్ సర్కారు చెబుతున్న నవరత్నాల వ్యవహారం కూడా అలాంటిదేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
టీడీపీ – జనసేన పార్టీలు కలిసింది, వైఎస్ జగన్ని అధికార పీఠం నుంచి దించడానికి మాత్రమే కాదు, శాశ్వతంగా వైఎస్ జగన్ రాజకీయాల్లో వుండటానికి వీల్లేకుండా చేయడానికని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
కేవలం రాష్ట్రం కోసమే టీడీపీతో జనసేన జతకట్టిందన్న జనసేనాని, టీడీపీ అనుభవానికి జనసేన పోరాట పటిమ తోడైతే, రాష్ట్ర రాజకీయాల్లో అద్భుతాలు జరుగుతాయనీ, జనసేన – టీడీపీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పవన్ కళ్యాణ్ అన్నారు.
స్థానిక ప్రజా ప్రతినిథి దోపిడీకి, విలువైన వనరులు నాశనమవుతున్నాయనీ, అన్నిట్లోనూ కమిషన్లు కొట్టేస్తూ, ప్రజల్ని పీడిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇసుక దోపిడీ సహా, వివిధ పనులకు సంబంధించి స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిథులు వసూళ్ళు చేస్తోన్న వాటాల్ని సవివరంగా జనసేనాని ప్రస్తావించారు.
మరోపక్క, పెడన నియోజకవర్గంలో వారాహి విజయ యాత్రకు సంబంధించి అధికార వైసీపీ కుట్రలు చేస్తోందనీ, అసాంఘీక శక్తులు వారాహి విజయ యాత్రపై దాడికి సిద్ధమవుతోందనీ జనసేనాని ఆరోపించడంపై, పోలీస్ ఉన్నతాధికారులు గుస్సా అయ్యారు. పవన్ కళ్యాణ్ ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించాలంటూ, నోటీసులు పంపించారు.
ఈ నోటీసులపై జనసేనాని వారాహి విజయ యాత్ర సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. హైద్రాబాద్ నుంచి విజయవాడకు ఇటీవల తాను వస్తున్నప్పుడు, తన పార్టీ కార్యాలయానికి తాను వెళుతోంటే, చంద్రబాబుకి సంఘీభావం పలకడం కోసం ఏసీబీ కోర్టుకు వెళుతున్నట్లుగా పోలీసు శాఖకు ఎలా సమాచారం అందిందంటూ జనసేనాని ప్రశ్నించారు.
జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తాను వెళ్ళకుండా, తనను అడ్డుకునే ప్రయత్నం పోలీసులే చేశారన్న జనసేనాని, ఇదేం పద్ధతి.? వైసీపీ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం పని చెయ్యాలంటూ పోలీసు శాఖలో కొందరు అధికారుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు జనసేనాని.
‘వైఎస్ జగన్.. నువ్వు పరీక్షకల్లో కాపీ కొడుతున్నప్పుడు నేను దేశం గురించి ఆలోచించిన వ్యక్తిని..’ అంటూ ఎద్దేవా చేసిన జనసేనాని, ‘పార్లమెంటులో సోనియాగాంధీకి కనిపించకుండా ప్లకార్డులు రివర్సులో పట్టుకుని, చాటుగా నినదించిన వైఎస్ జగన్, సోనియాగాంధీని ఎదిరించానని ఇప్పుడు చెబుతున్నారు..’ అంటూ వెటకారం చేయడం కొసమెరుపు.
I’ve leadn sevveral excellent stuff here. Certainly worth bookmarking for revisiting.
I wobder hoow much attempt yyou put to make anny such fantawtic informative website.
Howdy! I kno this iis kinda offf topic nevertueless I’d
ffigured I’d ask. Woukd youu bbe interesed iin exchangig links or aybe gues authoring a bloig post oor vice-versa?
My blg goes ovrr a lot oof the same subjects as youurs and I feel wwe could greatly benedfit
from each other. If you happen to bee interesated fesel free to send mme ann email.
I loik forward to heaeing fro you! Fantastic blog bby thhe way!