Switch to English

టీడీపీదే అధికారం.. కాదు వైసీపీకే రాజయోగం!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఎన్నికలు వస్తున్నాయంటే ఎక్కడ చూసినా గెలుపోటములపై చర్చ జరగడం సహజం. ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ సందర్భంగా ఓటరు నాడి ఎలా ఉంది? ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనే అంశంపై పలు సంస్థలు సర్వేలు కూడా నిర్వహిస్తుంటాయి. వాటిలో ప్రామాణికత ఎంత ఉందనే విషయాన్ని పక్కనపెడితే, అలాంటి సర్వేలపై జనం ఆసక్తి కనబరుస్తుంటారు.

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే పలు సంస్థలు తమ అంచనాలు ఇవీ అంటూ ఫలితాలు వెల్లడించాయి. కొన్ని సర్వేలు అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకుంటుందని చెప్పగా.. మరికొన్ని సర్వేలు ఈసారి వైఎస్సార్ సీపీకి రాజయోగం ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో రెండు సర్వేలు విడుదలయ్యాయి. ఇవి రెండూ పరస్పర విరుద్ధమైన ఫలితాలు వెల్లడించాయి.

కార్పొరేట్ చాణక్య పేరుతో విడుదలైన సర్వేలో అధికార పీఠం తెలుగుదేశం పార్టీదే అని ఉద్ఘాటించగా.. ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ విడుదల చేసిన సర్వేలో వైఎస్సార్ సీపీదే ప్రభంజనం అని స్పష్టంచేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కార్పొరేట్ చాణక్య అనే సంస్థ ఫిబ్రవరి 14 నుంచి ఏప్రిల్ 3వ తేదీ మధ్యలో నిర్వహించిన సర్వేలో టీడీపీకి అధికారం దక్కుతుందని వెల్లడైనట్టు పేర్కొంది. ఈ సంస్థ అంచనాల మేరకు అధికార తెలుగుదేశం పార్టీకి 98 నుంచి 101 స్థానాలు వస్తాయని వివరించింది. ట్రెండ్ ఇంకా ఎక్కువగా ఉంటే టీడీపీకి 110 స్థానాలు గ్యారెంటీ అని పేర్కొంది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మరోసారి ప్రతిపక్షానికే పరిమితమవుతుందని, ఆ పార్టీకి 71 స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది. ఇక పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కేవలం మూడు స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని వివరించింది. చంద్రబాబు సీఎంగా ఉండాలని ఏకంగా 53.8 శాతం మంది కోరుకుంటుండగా.. జగన్ ముఖ్యమంత్రి కావాలని 41.1 శాతం మంది అభిప్రాయపడినట్టు సర్వే వెల్లడించింది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కు కేవలం 6.4 శాతం మంది మాత్రమే మద్దతిచ్చినట్టు తెలిపింది.

ఈ సర్వే విడుదలైన తర్వాత ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ తన సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలు వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఆ పార్టీ ఏపీలో ప్రభంజనం సృష్టించడం ఖాయమని స్పష్టంచేసింది. 25 ఎంపీ సీట్లలో వైఎస్సార్ సీపీ 20 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. తద్వారా అత్యధిక సీట్లు గెలుచుకున్న ప్రాంతీయ పార్టీలో మూడో పెద్ద పార్టీగా నిలుస్తుందని అభిప్రాయపడింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 30 స్థానాలు గెలుచుకుని మొదటి స్థానంలో ఉంటుందని, తమిళనాడులోని డీఎంకే 25 స్థానాలతో రెండో స్థానంలో ఉంటుందని పేర్కొంది. వైఎస్సార్ సీపీ తర్వాత ఒడిశాలోని బిజూ జనతాదళ్ 16 సీట్లు, తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ 15 సీట్లతో నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకుంటాయని వివరించింది.

మొత్తమ్మీద తాజాగా వచ్చిన రెండు సర్వేలు చెరో పార్టీకి అవకాశం ఉందని తేల్చాయి. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచి చూడక తప్పదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...