ఎన్నికలు వస్తున్నాయంటే ఎక్కడ చూసినా గెలుపోటములపై చర్చ జరగడం సహజం. ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ సందర్భంగా ఓటరు నాడి ఎలా ఉంది? ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనే అంశంపై పలు సంస్థలు సర్వేలు కూడా నిర్వహిస్తుంటాయి. వాటిలో ప్రామాణికత ఎంత ఉందనే విషయాన్ని పక్కనపెడితే, అలాంటి సర్వేలపై జనం ఆసక్తి కనబరుస్తుంటారు.
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే పలు సంస్థలు తమ అంచనాలు ఇవీ అంటూ ఫలితాలు వెల్లడించాయి. కొన్ని సర్వేలు అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకుంటుందని చెప్పగా.. మరికొన్ని సర్వేలు ఈసారి వైఎస్సార్ సీపీకి రాజయోగం ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో రెండు సర్వేలు విడుదలయ్యాయి. ఇవి రెండూ పరస్పర విరుద్ధమైన ఫలితాలు వెల్లడించాయి.
కార్పొరేట్ చాణక్య పేరుతో విడుదలైన సర్వేలో అధికార పీఠం తెలుగుదేశం పార్టీదే అని ఉద్ఘాటించగా.. ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ విడుదల చేసిన సర్వేలో వైఎస్సార్ సీపీదే ప్రభంజనం అని స్పష్టంచేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కార్పొరేట్ చాణక్య అనే సంస్థ ఫిబ్రవరి 14 నుంచి ఏప్రిల్ 3వ తేదీ మధ్యలో నిర్వహించిన సర్వేలో టీడీపీకి అధికారం దక్కుతుందని వెల్లడైనట్టు పేర్కొంది. ఈ సంస్థ అంచనాల మేరకు అధికార తెలుగుదేశం పార్టీకి 98 నుంచి 101 స్థానాలు వస్తాయని వివరించింది. ట్రెండ్ ఇంకా ఎక్కువగా ఉంటే టీడీపీకి 110 స్థానాలు గ్యారెంటీ అని పేర్కొంది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మరోసారి ప్రతిపక్షానికే పరిమితమవుతుందని, ఆ పార్టీకి 71 స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది. ఇక పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కేవలం మూడు స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని వివరించింది. చంద్రబాబు సీఎంగా ఉండాలని ఏకంగా 53.8 శాతం మంది కోరుకుంటుండగా.. జగన్ ముఖ్యమంత్రి కావాలని 41.1 శాతం మంది అభిప్రాయపడినట్టు సర్వే వెల్లడించింది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కు కేవలం 6.4 శాతం మంది మాత్రమే మద్దతిచ్చినట్టు తెలిపింది.
ఈ సర్వే విడుదలైన తర్వాత ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ తన సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలు వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఆ పార్టీ ఏపీలో ప్రభంజనం సృష్టించడం ఖాయమని స్పష్టంచేసింది. 25 ఎంపీ సీట్లలో వైఎస్సార్ సీపీ 20 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. తద్వారా అత్యధిక సీట్లు గెలుచుకున్న ప్రాంతీయ పార్టీలో మూడో పెద్ద పార్టీగా నిలుస్తుందని అభిప్రాయపడింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 30 స్థానాలు గెలుచుకుని మొదటి స్థానంలో ఉంటుందని, తమిళనాడులోని డీఎంకే 25 స్థానాలతో రెండో స్థానంలో ఉంటుందని పేర్కొంది. వైఎస్సార్ సీపీ తర్వాత ఒడిశాలోని బిజూ జనతాదళ్ 16 సీట్లు, తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ 15 సీట్లతో నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకుంటాయని వివరించింది.
మొత్తమ్మీద తాజాగా వచ్చిన రెండు సర్వేలు చెరో పార్టీకి అవకాశం ఉందని తేల్చాయి. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచి చూడక తప్పదు.
225616 620595You ought to join in a contest for starters with the highest quality blogs online. I will recommend this page! 401523
507123 87589Really instructive and very good bodily structure of topic matter, now thats user pleasant (:. 754738
8392 984200Some genuinely nice and utilitarian information on this internet site , likewise I believe the layout has wonderful capabilities. 88680
671570 171770Ill right away grasp your rss feed as I cant in discovering your email subscription hyperlink or e-newsletter service. Do youve any? Please let me realize so that I may subscribe. Thanks. 325330