ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం ఇటీవల పెద్ద సంఖ్యలో కొత్త అంబులెన్స్లను 104, 108 సేవల నిమిత్తం అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే. అయితే, ఈ అంబులెన్స్ల వ్యవహారంలో తెరవెనుక పెద్ద కుంభకోణం జరిగిందనీ, సాక్షాత్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువుకి వందల కోట్లు ముట్టజెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టారనీ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.
నిజానికి, అంబులెన్స్ స్కామ్.. అంటూ తొలుత బీజేపీ తొలుత నినదించింది. ఆ తర్వాత టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం ఈ వ్యవహారంలో మరింత అత్యుత్సాహం చూపారు. ఓ దశలో ఆయన అరెస్ట్ అవుతారనే ప్రచారం కూడా జరిగింది. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరగలేదనీ, అడ్డగోలుగా అధిక ధరకు ఈ అంబులెన్స్ల నిర్వహణ కాంట్రాక్ట్ని విజయసాయిరెడ్డి బంధువుకి చెందిన సంస్థకు అప్పగించారనీ టీడీపీ నేతలు ఆరోపించడం, అందుకు అనుగుణంగానే టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు రావడం చకచకా జరిగిపోయాయి.
సోషల్ మీడియాలోనూ పెద్దయెత్తున ఈ విషయమై దుమారం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ‘దుష్ప్రచారం – తప్పుడు కథనాలు’ అన్న కోణంలో టీడీపీ అధికార ప్రతినిది¸ కొమ్మారెడ్డి పట్టాభిరాం, ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తప్పుడు ఆరోపణలు, తప్పుడు కథనాలపై తక్షణం బేషరతు క్షమాపణ చెప్పాలన్నది ఆ నోటీసుల సారాంశం. క్షమాపణ చెప్పని పక్షంలో ‘సివిల్, క్రిమినల్’ చర్యలకు వారే బాధ్యత వహించాలని నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతోందనీ, తద్వారా 399 కోట్ల రూపాయల ఆదా జరిగిందనీ ప్రభుత్వం వెల్లడించింది. రివర్స్ ప్రారంభ ధర, రివర్స్ ముగింపు ధర, చర్చల ద్వారా నిర్ధారించిన ధర.. ఇలా పూర్తి వివరాల్ని నోటీస్లో పేర్కొనడం గమనార్హం. మరి, ఈ నోటీసుల వ్యవహారంపై టీడీపీ ఎలా స్పందిస్తుంది.? టీడీపీ అనుకూల మీడియాగా పేరు పడ్డ సదరు మీడియా సంస్థలు ఎలాంటి వివరణ ఇస్తాయి.? వేచి చూడాల్సిందే.
465070 990136very good publish, i definitely love this internet website, keep on it 620210
97784 331563Good site. On your blogs really interest and i will tell a pals. 57413
731221 620598youve got an crucial weblog proper here! would you wish to make some invite posts on my blog? 795004