ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాత్రికి రాత్రి డీజీపీ మార్పు జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్పై బదిలీ వేటు పడింది. ఏసీబీ డీజీగా పనిచేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావుపైన కూడా బదిలీ వేటు పడటం గమనార్హం. ఠాకూర్ స్థానంలో గౌతమ్ సవాంగ్ కొత్త డీజీపీగా ఎంపికయ్యారు. కాగా, ఠాకూర్, వెంకటేశ్వరరావు ఇద్దరూ చంద్రబాబు హయాంలో అధికార పార్టీకి వత్తాసు పలికారన్న ఆరోపణల్ని ఎదుర్కొన్నవారే.
ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు పడింది. అప్పటికి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించేవారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ద్వారా వైఎస్సార్సీపీ, వెంకటేశ్వరరావుపై వేటు వేయించగలిగింది. ఇప్పుడు పూర్తిగా అధికారమే తమ చేతుల్లోకి వచ్చాక ఊరుకుంటారా.? అధికారంలోకి వస్తూనే తమకు అనుకూలంగా వుండే అధికారులకు పెద్ద పీట వేస్తూ, నచ్చని అధికారుల్ని ‘దూరంగా వుంచే’ కార్యక్రమాన్ని షురూ చేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆ మాటకొస్తే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇలాంటి వ్యవహారాలు మామూలే అయినా, కాస్తంత కూడా టైమ్ తీసుకోకుండా అత్యంత వేగంగా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వైఎస్ జగన్ వివాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు.
ఆర్పీ ఠాకూర్ విషయానికొస్తే, ఈయన్ని డీజీపీ పదవిలోంచి తప్పించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే అప్పట్లో చంద్రబాబు సర్కార్, ఆర్పీ ఠాకూర్కి పూర్తిస్థాయిలో అండదండలు అందించింది. మరీ ముఖ్యంగా కోడి కత్తి ఎపిసోడ్లో ఠాకూర్ అత్యుత్సాహం వివాదాస్పదమయినా, టీడీపీ ఆయన్ని వెనకేసుకొచ్చింది. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే, దాన్ని పబ్లిసిటీ కోసం చేసిన దాడిగా అభివర్ణించి ఠాకూర్ వివాదాల్లోకెక్కారు. అఫ్కోర్స్, ఆ కేసు విచారణ ఎన్ఐఏ తమ చేతుల్లోకి తీసుకున్నా, ఇప్పటిదాకా ఆ కేసుకి సంబంధించి పూర్తి వాస్తవాలు ప్రజల ముందుకు రాలేదనుకోండి. అది వేరే సంగతి. ఆ కోడి కత్తి ఎపిసోడ్, ఇప్పుడు ఠాకూర్పై వేటు పడేలా చేసింది. ఆ ఘటనకు సంబంధించి ఇంటెలిజెన్స్ వైఫల్యంపైనా వైఎస్సార్సీపీ అప్పట్లో చాలా యాగీ చేసింది. ఇప్పుడు అవకాశం వచ్చింది గనుక, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావుపై ఇప్పుడు బదిలీ పేరుతో చర్యలు తీసుకుందని భావించాలేమో.
పరిపాలన సంగతేమోగానీ, ముందైతే అధికారుల బదిలీల పేరుతో వేటు వేయడంలో మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యుత్సాహం చూపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా వుంటే, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో వైఎస్ జగన్ ఈ రోజు సమీక్షలు నిర్వహించబోతున్నారు. శాఖల వారీగా శ్వేతపత్రాల్ని విడుదల చేయడానికి సంకల్పించుకున్న వైఎస్ జగన్, శ్వేత పత్రాల విడుదల తర్వాత పూర్తిస్థాయిలో పాలనపై దృష్టిపెడతారట. మరోపక్క, మంత్రి వర్గ కూర్పు విషయమై పార్టీ ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వారం రోజుల్లోనే మంత్రి వర్గ కూర్పు విషయమై ఓ క్లారిటీ రాబోతోందట. ఆ వెంటనే, అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
494089 389336You should participate in a contest for among the most effective blogs on the internet. I will suggest this web site! 451516
69249 308365Black Ops Zombies is now available […]Take a look here[…] 760938