హఫీజ్ పేట భూముల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆ 140 ఎకరాల భూములు ప్రభుత్వానికి గానీ, వక్ఫ్ బోర్డుకు కానీ చెందవని.. అవి ప్రైవేటు వ్యక్తులకే చెందుతాయని సంచలన తీర్పు ఇచ్చింది. సర్వే నెంబర్ 80 వివాదాస్పద భూములపై హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఈమేరకు పిటిషనర్లకు రూ.4 లక్షలు చెల్లించాలని కూడా వక్ఫ్ బోర్డు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
50 ఎకరాలు ప్రవీణ్ రావు, సహా యజమానుల పేరిట నమోదు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి ప్రభుత్వ సిద్ధమవుతోంది. ఈ భూములు తమవేనని ప్రవీణ్ రావుతోపాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. హఫీజ్ పేట భూ వివాదంలోనే ప్రవీణ్ రావు కిడ్నాప్ ఉదంతం తీవ్ర సంచలనం రేపింది. ఈ కిడ్నాప్ వ్యవహారంలోనే అఖిలప్రియ అరెస్టయ్యారు. బెయిల్ పై విడుదలయ్యారు. ఆమె భర్త, సోదరుడు కూడా ఇటివలే పోలీసుల ఎదుట లొంగిపోయారు.
910711 842477Hey this is kinda of off topic but I was wanting to know if blogs use WYSIWYG editors or if you need to manually code with HTML. Im starting a weblog soon but have no coding experience so I wanted to get advice from someone with experience. Any help would be greatly appreciated! 234759