‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకి పదేళ్ళ క్రితమే అంకురార్పణ చేశారు రచయిత ద్వయం పరుచూరి బ్రదర్స్. దాదాపు పన్నెండేళ్ళ క్రితం పరుచూరి ఆలోచనల్లోంచి ఈ సినిమా పుట్టింది. ఈ విషయాన్ని చిరంజీవి పదే పదే చెబుతూ వస్తున్న విషయం విదితమే. సినీ పరిశ్రమలో స్టార్ రైటర్స్గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న పరుచూరి బ్రదర్స్ వేటు వేస్తే తప్ప, సినీ పరిశ్రమకు మంచి జరగబోదంటూ ఓ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు.
‘రుద్రమదేవి’ సినిమాలో గోనగన్నారెడ్డి పాత్రకు డైలాగులు రాసింది తానేననీ, ‘మనసంతా నువ్వే’ సినిమా కోసం పనిచేస్తే, ఆ క్రెడిట్ తనకు దక్కకుండా చేశారనీ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకుడు వైవీఎస్ చౌదరి లాంటివాళ్ళు కూడా తనకు అన్యాయం చేశారంటూ దర్శకుడు తాడినాడ రాజసింహ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వెల్లగక్కాడు.
ఓ దర్శకుడు సైతం ఇలాంటి అన్యాయాల కారణంగా ప్రాణాలు కోల్పోయాడని రాజసింహ ఆరోపిపించాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు రాజ సింహ. రైటర్స్ యూనియన్లో వుండడానికే పరుచూరి బ్రదర్స్కి అర్హత లేదన్నది రాజసింహ వాదన.
అయితే, తన వాదనతో ఎవరూ ఏకీభవించే పరిస్థితి వుండదనీ, ఎందుకంటే పెద్దలంతా పరుచూరి బ్రదర్స్కే మద్దతు పలుకుతారని కూడా రాజసింహ అంటున్నాడు. నిజానికి, సినీ పరిశ్రమలో ఇలాంటి ఆరోపణలు కొత్తేమీ కాదు. కథ కొట్టేశారంటూ చాలామంది యంగ్స్టర్స్ ఆందోళనలు చేస్తూ వస్తుంటారు. ఆ తర్వాత ఆయా వివాదాలు సద్దుమణిగిపోతుంటాయి. మరి, పరుచూరి బ్రదర్స్ విషయంలో ‘సైరా నరసింహారెడ్డి’ రిలీజ్ టైమ్లో ఓ దర్శకుడు చేస్తున్న ఆరోపణలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.
76226 809777Hey! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im definitely enjoying your blog and look forward to new updates. 578172
686354 705046Hey, you used to write amazing, but the last couple of posts have been kinda boringK I miss your fantastic writings. Past couple of posts are just a bit out of track! come on! 239174
229984 750946Wow that was strange. I just wrote an extremely long comment but following I clicked submit my comment didnt appear. Grrrr properly Im not writing all that more than again. Regardless, just wanted to say wonderful blog! 716821