కోవిడ్ వ్యాక్సిన్ను రాహుల్ గాంధీ ఎందుకు తీసుకోలేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. దేశంలో వ్యాక్సిన్ కొరత లేకపోయినా.. వ్యాక్సిన్ తీసుకోవాలనే శ్రద్ధ ఆయనకు లేదని విమర్శించారు. అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి రాహుల్ లేఖ రాసిన సందర్భంగా మంత్రి ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. రాహుల్ వ్యాక్సిన్ ను మర్చిపోయారా? ఆయనకు అవసరం లేదా? ఇప్పటికే తీసుకుని చెప్పట్లేదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నది వ్యాక్సిన్ కొరత కాదని.. వ్యాక్సిన్ వేయించుకోవాలనే నిబ్ద్ధత కొరవడిందని రాహుల్ తెలుసుకోవాలని అన్నారు. వసూలీ వెంచర్లను ఆపి.. తమ దగ్గరున్న లక్షలాది వ్యాక్సిన్లను ప్రజలకు ఇచ్చేలా లేఖలు రాయాలని అన్నారు. ఒకప్పుడు యుద్ధ విమానాల కంపెనీల కోసం లాబీయింగ్ చేసిన రాహుల్.. ఇప్పుడు విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులివ్వాలంటూ విదేశీ కంపెనీల కోసం లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు.. దేశంలో వ్యాక్సిన్ల కొరత లదనీ.. అన్ని రాష్ట్రాలకూ వ్యాక్సిన్లు పంపించామని అమిత్ షా ప్రకటించారు.