తమన్నా సింహాద్రి బిగ్హౌస్లోకి ఎప్పుడైతే ఎంటరైందో.. ఆ తర్వాత బిగ్ బాస్ 3 తెలుగు రియాల్టీ షో ‘స్థాయి’ పడిపోవడం మొదలైంది. ట్రాన్స్జెండర్కి ఈ షోలో అవకాశం కల్పించడం గొప్ప విషయమే. కానీ, ‘గేమ్ స్ట్రాటజీ’ని తమన్నా అమలు చేసిన విధానమే జుగుప్సాకరం. హౌస్లోకి వస్తూనే వరుణ్ – వితికల సంగతి తేల్చుతానని చెప్పిన తమన్నా, ఆ తర్వాత అలీ రెజాపైనా విరుచుకుపడింది. చివరికి రవికృష్ణని టార్గెట్ చేసింది. తొలి ఎలిమినేషన్కే ఆమె ఔట్ అయిపోయిందనుకోండి.. అది వేరే విషయం.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి, తాను ఎదుర్కొన్న తొలి ఎలిమినేషన్తోనే షో నుంచి బయటకు వెళ్ళిపోయింది తమన్నా. కానీ, రవికృష్ణపై ఆమె చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, ఆ తర్వాత హౌస్లో రవికృష్ణకు పెరిగిన ‘అతి మంచోడు’ ఇమేజ్.. వెరసి, షో మీద జనంలో అసహనం పెరిగిపోయింది. రీ-యూనియన్లో తమన్నా, రవికృష్ణకి క్షమాపణ చెప్పింది. అయితే, అదంతా చాలా డ్రమెటిక్గా అన్పించింది.
శ్రీముఖి యాజ్ యూజువల్ వెయిట్ లిఫ్టర్గా మారి తమన్నాని అమాంతం పైకి ఎత్తేసింది. ఒక్క తమన్నానే కాదు, దాదాపు అందరు పాత హౌస్మేట్స్ (ముఖ్యంగా ఫిమేల్ కంటెస్టెంట్స్) అలా పైకి లేపేసి, కొందర్నయితే చంకెక్కించేసుకుంది కూడా శ్రీముఖి. శ్రీముఖి – తమన్నా మధ్య గుసగుసలు ఎక్కువగా విన్పించాయి. ‘చెప్పొచ్చో లేదోగానీ..’ అంటూ హౌస్లో మళ్ళీ ‘గందరగోళ వాతావరణం’ సృష్టించేందుకు తమన్నా ప్రయత్నించడం గమనార్హం.
మొత్తమ్మీద, రవికృష్ణ మీద ‘గేమ్ స్ట్రాటజీ’ అమలు చేశానని తమన్నా ఒప్పుకుందిగానీ, అది ఆమె గేమ్ ప్లాన్ అనుకోవాలా.? బిగ్బాస్ ఇచ్చిన స్క్రిప్ట్ అనుకోవాలా.? ‘రవికృష్ణ బలైపోయాడు..’ అని తమన్నా చెప్పిన వైనం కొత్త అనుమానాలకు తావిచ్చింది.
