Switch to English

పరిషత్ యుద్ధం: హైకోర్టు ఏం చెప్పబోతోంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పొద్దున్నే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనే బాధ్యతాయుతమైన పదవిలోకి రావడం, సాయంత్రానికి పరిషత్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం.. వెరసి రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ వివాదాల్లోకెక్కారు. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి ఎలా వుంది.? వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా.? కీలక శాఖల నుంచి ఆమె ఎలాంటి సమాచారం తెప్పించుకున్నారు.? వాటిని ఆమె ఎలా విశ్లేషించారు.? అంటూ విపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలు అన్నీ ఇన్నీ కావు.

నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన అంశాన్ని వివిధ రాజకీయ పార్టీలు ప్రస్తావిస్తున్నాయి. అయితే, కేవలం ఆరు రోజుల పక్రియ పూర్తి చేసేస్తే.. ఓ పనైపోతుందన్న ధోరణిలో జగన్ ప్రభుత్వం వుంది. నిజానికి, నీలం సాహ్నీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వున్న సమయంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంతలా కోరినా, సహకరించలేదన్న విమర్శలున్నాయి. ఈ విషయమై నిమ్మగడ్డ.. పదే పదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారు కూడా. అప్పుడు సహకరించని నీలం సాహ్నీ, ఇప్పుడు ఎస్ఈసీ హోదాలో.. వివిధ విభాగాల నుంచి అప్పటికప్పుడు సహకారం ఎలా పొందగలిగారంటూ టీడీపీ సహా వివిధ విపక్షాలు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.

మరోపక్క, ఎస్ఈసీ తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయా పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఎస్ఈసీ స్పందనను రేపు ఉదయంలోగా తెలియజేయాలని ఆదేశించింది. రేపటికి కేసు విచారణను వాయిదా వేసింది. నీలం సహానీ ఏం చెప్పబోతున్నారు.? ఇంత తక్కువ సమయంలో ఆమెకు అన్ని విభాగాల నుంచి సహకారం ఎలా అందింది.? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించకుండానే ప్రభుత్వం నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విషయమై సమాచారం బయటకెలా పొక్కింది.? ఈ ప్రశ్నలన్నటికీ రేపు సమాధానం దొరకనుందన్నమాట.

ఒకవేళ కోర్టు మొట్టికాయలు వేసిందంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి చేపట్టాక అది నీలం సహానీకి తొలి షాక్ అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే, ప్రక్రియ ప్రారంభమయినట్లే గనుక, కోర్టు ఎంతవరకు జోక్యం చేసుకుంటుందన్నదీ ఆలోచించాల్సిన విషయమే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....