ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమా సుకుమార్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సుకుమార్ అండ్ టీం కేరళ వెళ్లి లొకేషన్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకుని వచ్చారు. అలాగే రీసెంట్ గా సుకుమార్ హీరోయిన్ రష్మిక మందన్న లుక్ టెస్ట్ కూడా చేసి తనకి ఓ డిఫరెంట్ లుక్ ని ఫైనల్ చేశారు. గత సినిమాల కంటే చాలా కొత్తగా రష్మిక ఇందులో కనిపించనుంది.
ఇలా ఒక్కొక్క ప్రీ ప్రొడక్షన్ పని సుకుమార్ పూర్తిచేసుకుంటూ వస్తున్నాడు. మేము తెలుసుకున్న స్పెషల్ న్యూస్ ప్రకారం మార్చి సెకండాఫ్ లో ఈ చిత్ర షూటింగ్ కేరళలో మొదలవుతుంది. మార్చి మొదట్లోనే అనుకున్నా అల్లు అర్జున్ తన లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుండడం వలన మార్చి సెకండ్ వీక్ లో లుక్ టెస్ట్ ఫైనల్ చేసి ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్లనున్నారు. గడ్డం మరియు లాంగ్ హెయిర్ కోసం అల్లు అర్జున్ మరికొంత సమయం తీసుకుంటున్నాడు.
అంతే కాకుండా అల్లు అర్జున్ కంటిన్యూగా షూట్ చేసి 2020లోనే సినిమాని రిలీజ్ చేయాలని ఈ చిత్ర టీం కి చెప్పినట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ ఉండడంతో ఆ టైం కి కష్టం అవ్వచ్చు లేదంటే 2021 సమ్మర్ వరకూ వెయిట్ చెయ్యాలి. అందుకే ఈ ఏడాదిలోనే రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర టీంకి సూచించారట.
బేసిక్ గా సుకుమార్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటారు మరి ఈ సారి అల్లు అర్జున్ కోరిక మేరకు అనుకున్న టైంలో ఫినిష్ చేసి రిలీజ్ చేస్తారేమో చూడాలి. టీంకి టఫ్ అయినప్పటికీ ఏడాదిలో అల్లు అర్జున్ రెండు సినిమాలన్నా చూడాలనుకునే ఫ్యాన్స్ కి మాత్రం పండగ లాంటి న్యూస్ ఇది.
835381 399081Your writing style has been amazed me. Thank you, very nice article. 37890
421877 587715Nicely picked details, a lot of thanks towards the author. Its incomprehensive in my experience at present, however in common, the convenience and importance is mind-boggling. Regards and all of the best .. 48318
617260 31614Yay google is my world beater assisted me to uncover this excellent site! . 762426
72461 332576I got what you intend, saved to fav, quite good internet site . 98232