Switch to English

బర్త్‌డే స్పెషల్‌: ఇస్మార్ట్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

టాలీవుడ్‌ కు చెందిన ఈతరం దర్శకుల్లో పూరి జగన్నాధ్‌ కి ప్రత్యేకమైన శైలి ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన సినిమాల మేకింగ్‌ విషయంలో చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఆయనతోటి దర్శకుల్లో ఏ ఒక్కరు కూడా పాతిక సినిమాలు కూడా చేయలేక పోయారు, భవిష్యత్తులో చేస్తారో లేదో కూడా తెలియదు. కాని ఇప్పటికే ఆయన 32 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఒకానొక సమయంలో ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేసిన పూరి జగన్నాద్‌ గత రెండేళ్లుగా కాస్త స్పీడ్ తగ్గించాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్ తో మళ్లీ జోరు పెంచుతాడు అనుకుంటున్న సమయంలో కరోనా కారణంగా ఆయన జోరుకు బ్రేక్‌ పడ్డట్లయ్యింది.

పూరి జగన్నాద్‌ మొదటి సినిమాను పవన్‌ కళ్యాణ్‌ తో చేశారు. బద్రి సినిమాపై మొదట్లో ఎవరికి అస్సలు అంచనాలు ఆసక్తి లేదట. కాని అనూహ్యంగా ఆ సినిమా హిట్‌ అవ్వడంతో స్టార్‌ హీరోల దృష్టిని ఆకర్షించాడు. 2000 సంవత్సరంలో బద్రితో ఎంట్రీ ఇచ్చిన పూరి 2001లో బాచి సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా మిస్‌ ఫైర్‌ అయినా కూడా అదే సంవత్సరంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా సెన్షేషనల్‌ సక్సెస్‌ అయ్యింది. ఆ తర్వాత ఏడాది వచ్చిన ‘ఇడియట్‌’ సినిమాతో పూరి యూత్‌ లో యమ క్రేజ్‌ ను దక్కించుకున్నాడు. 2002లో ఇండియట్‌, 2003లో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మరియు శివమణి సినిమాలతో టాలీవుడ్‌ లో టాప్‌ దర్శకుల జాబితాలో చేరి పోయాడు.

ఎన్టీఆర్‌ తో 2004లో తెరకెక్కించిన ఆంధ్రావాలా సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఆ తర్వాత కాస్త నిరాశ మిగిల్చినా 2006 సంవత్సరంలో మహేష్‌ బాబుతో ‘పోకిరి’ సినిమా తీసి ఇండస్ట్రీ హిట్‌ దక్కించుకున్నాడు. ఆ సినిమా తర్వాత దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, నేనింతే, ఏక్‌ నిరంజన్‌ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు చేశాడు. పూరి చేసిన సినిమాల్లో ఏక్కువ శాతం సక్సెస్‌ రేటు ఉండటం ఆయన ప్రత్యేకత. తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్‌ తో సినిమాను తీయడం ఆయన నుండి నేర్చుకోవాలంటూ ఒక సినిమా వేడుకలో రాజమౌళి అన్నారంటే ఆయన స్టామినా సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

దేవుడు చేసిన మనుషులు సినిమాను ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ తో తెరకెక్కించి ప్రయోగాలకు ఎప్పుడు వెనకాడను అంటూ పూరి మరోసారి నిరూపించుకున్నాడు. ఒక వైపు సూపర్‌ స్టార్స్‌.. స్టార్స్‌ తో సినిమాలు చేసే పూరి మరో వైపు జ్యోతిలక్ష్మి వంటి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను కూడా చేశాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో కాస్త డల్‌ గా ఉన్న కెరీర్‌ ను పీక్స్‌ లోకి తీసుకు వెళ్లిన పూరి ప్రస్తుం విజయ్‌ దేవరకొండతో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందుతుంది.

పూరి ఇప్పటి వరకు తెలుగులోనే కాకుండా హిందీ మరియు కన్నడ భాషల్లో కూడా సినిమాలను తెరకెక్కించాడు. ఆయన ముందు ముందు మరిన్ని హిందీ సినిమాలను కూడా చేసే అవకాశం ఉంది. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. పూరి తనయుడు ఆకాష్‌ ఇప్పటికే హీరోగా పరిచయం అయ్యాడు. పూరి దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాతో పూరిఆకాష్‌ కు సక్సెస్‌ దక్కతుందని భావించగా నిరాశే మిగిలింది. ప్రస్తుతం తనయుడితో ఒక సినిమాను పూరి నిర్మిస్తున్నాడు.

నిర్మాత దర్శకుడిగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న పూరి జగన్నాద్‌ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికి మర్చి పోలేని సినిమాలను అందించారు. ఆయన దర్శకత్వంలో ముందు ముందు కూడా మరిన్ని ఇస్మార్ట్‌ మూవీస్‌ రావాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు మా మీ తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిజేస్తున్నాం. ఆయన ముందు ముందు మరిన్ని సూపర్‌ హిట్‌ లను దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యపీ బర్త్‌ డే ఇస్మార్ట్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...