Switch to English

రాజ్యాంగ వ్యవస్థల్ని ‘హెచ్చరిస్తోన్న’ వైఎస్‌ జగన్‌ అభిమానులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

వాళ్ళంతా వైఎస్‌ జగన్‌ అభిమానులట.. వైసీపీ నేతలు కూడా.! రాజ్యాంగ వ్యవస్థలకు హెచ్చరికలు జారీ చేసేస్తున్నారు.! ‘రాజ్యాంగ వ్యవస్థ పేరుతో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సంకెళ్ళు వేస్తే చూస్తూ ఊరుకోం.. ప్రజల అభిమానం పొందిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు.?’ అని పేర్కొంటూ వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకి కూత వేటు దూరంలోనే గల బెజవాడ కనకదుర్గమ్మ వారధిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సహా, పలువురు వైసీపీ నేతల పొటోలతో వైసీపీ మద్దతుదారులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. గడచిన ఏడాది కాలంలో 100 సార్లకు పైగానే న్యాయస్థానాలో వైసీపీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయి. దీన్ని జీర్ణించుకోలేక న్యాయ వ్యవస్థపై వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై ఇప్పటికే న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. అయినాగానీ, వైసీపీ నేతల తీరు మారడంలేదు.

స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా న్యాయ వ్యవస్థపై ‘అత్యుత్సాహంతో’ కొన్ని వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ కూడా అత్యంత కీలకమైనది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వమైనాసరే, రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాల్సి వుంటుందన్న విషయాన్ని రాష్ట్రంలో అధికార వైసీపీ విస్మరిస్తే ఎలా.?

వైసీపీ, భారతదేశంలో ఓ రాష్ట్రానికి మాత్రమే పరిమితం. భారత దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఓ రాష్ట్రం మాత్రమే. భారత రాజ్యాంగాన్ని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలే కాదు, దేశంలోని ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాలి. ‘రాజ్యాంగ వ్యవస్థ’ పేరుతో సంకెళ్ళు వేయాలనుకుంటే.. అంటూ, హెచ్చరించే స్థాయికి అధికార వైసీపీ నేతలు కావొచ్చు, మద్దతుదారులు కావొచ్చు.. అత్యుత్సాహం చూపుతున్నారంటే, పరిస్థితి అత్యంత జుగుప్సాకరంగా తయారయ్యిందన్నది నిర్వివాదాంశం.

ఈ పరిస్థితుల్లో ఇలాంటి విపరీత ధోరణులపై న్యాయ వ్యవస్థ ఉక్కుపాదం మోపుతుందో.. లేదంటే, కేంద్రమే చర్యలు తీసుకుంటుందోగానీ.. రాష్ట్రంలో రాజ్యాంగ విలువల్ని కాపాడాల్సిన అవసరం మాత్రం ఏర్పడిందన్నది నిర్వివాదాంశం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...