ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు అందిస్తూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖని తెలుగుదేశం పార్టీ దూతలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేస్తారట. టీడీపీ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా తాను పదవీ ప్రమాణ స్వీకారం చేయబోయే కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా స్వయానా వైఎస్ జగన్, చంద్రబాబుకి ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. ఇదొక సంప్రదాయం.
చంద్రబాబు కూడా, జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవ్వాలనే అనుకున్నారట. కానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇతర నేతలు వారించారట. కారణమేంటంటే, రాజ్భవన్ లాంటి అధికారిక వేదికలపై కాకుండా, పబ్లిక్ మీటింగ్లా పెట్టి, ప్రైవేటు కార్యక్రమంలా ఈ మహోత్సవాన్ని నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకోవడమేనట. తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇలాంటి చిత్ర విచిత్రమైన వాదనలు చేయగలదు. 2014లో చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరు కాలేదు. ఇప్పుడు చంద్రబాబు హాజరు కాకపోయినా పెద్దగా ఎవరూ ఆక్షేపించరు. కానీ, ‘కుంటి సాకులు’ వెతుక్కోవడం ద్వారా టీడీపీ తన నైజాన్ని బయటపెట్టుకుంది.
జగన్ వద్దకు టీడీపీ దూతలుగా కొందరు వెళ్ళాలనుకోవడం, ఎవరెవరు వెళ్ళాలనే విషయాన్ని చంద్రబాబు ఖరారు చేయడం టీడీపీ మార్కు రాజకీయాలకు నిదర్శనం. వైఎస్ జగన్ అపాయింట్మెంట్ ఇస్తే, వెళ్ళి కలుస్తారట. జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అయితే వుండరు. కానీ, అక్కడ తమకు తగిన మర్యాద జరగలేదంటూ మెలిక పెట్టడానికి దీన్నొక అవకాశంగా తీసుకునేందుకు టీడీపీ ముందస్తుగానే పక్కా స్కెచ్ రెడీ చేసుకున్నట్లుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ‘పాజిటివ్ పాలిటిక్స్’. రాజకీయ విభేదాలు ఎన్ని వున్నా, రాష్ట్ర ప్రయోజనాల విషయానికొచ్చేసరికి అందరూ ఒక్కటవ్వాలి. కానీ, ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. ప్రత్యేక హోదా విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు టీడీపీ, వైసీపీ గత ఐదేళ్ళలో అనుసరించిన వైఖరి నూటికి నూరుపాళ్ళూ ఆక్షేపణీయమే. చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య సఖ్యత వుంటే తప్ప, రాష్ట్రం ఎదుర్కొంటోన్న ప్రధానమైన సమస్యలకు పరిష్కారం దొరకదు. కానీ, ఆ దిశగా ఇద్దరి మధ్యా సానుకూలత కనిపించే అవకాశాలే లేవు.
ఆరు నెలలు సమయమిద్దాం.. ఏడాది వేచి చూద్దామంటూ వైఎస్ జగన్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం గురించి ప్రస్తుతానికి టీడీపీ నుంచి సానుకూల ప్రకటనలు వస్తున్నా, అప్పుడే టీడీపీ ‘రంగు’ బయటపడిపోయింది. వైసీపీ నైజం బయటపడిపోవడానికి కూడా పెద్దగా సమయం అవసరం లేదు. ఎటూ వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.. అవి సమావేశాల్లా కాకుండా, రాజకీయ రచ్చకు వేదికగా మారకుండా వుంటుందా?
830164 445506hey there, your website is wonderful. I do thank you for work 515297
712630 581493Thank you for your style connected with motive though this info is certain spot a new damper within the sale with tinfoil hats. 62103
145168 586389I like this weblog so considerably, saved to my bookmarks . 929197