Switch to English

ఓ వైపు సంక్షేమం.. ఇంకో వైపు నిలువు దోపిడీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,378FansLike
57,764FollowersFollow

పొరుగు రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కువ. ఇతర రాష్ట్రాలతో పోల్చితే అత్యద్భుతంగా సంక్షేమ పథకాల్ని అమలు చేసేస్తున్నామని చెప్పుకుంటోన్న ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ‘పన్నులు ఎక్కువ’ అని కూడా చెప్పుకుంటే మంచిదేమో.! కానీ, అలా ఏ ప్రభుత్వమూ చేయదు. చంద్రబాబు హయాంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎక్కువే.. ఇతర రాష్ట్రాల కంటే. అప్పుడు చంద్రబాబు చెప్పిన కథ వేరు, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చెబుతున్న కథ వేరు. కానీ, ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తున్న వైనం మాత్రం ఒక్కటే. ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడటం’ అంటే ఇదే మరి.

ప్రతి నెలా చివరి వారంలో, మరుసటి నెల ఖర్చులెలా.? అన్న ఆందోళన రాష్ట్ర ఆర్థిక శాఖలో కనిపిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని ప్రత్యేక పరిస్థితి ఇది. అందుకే, ఎప్పటికప్పుడు జనాన్ని బాదేయడంపై కసరత్తులు చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో రాష్ట్రీయ రహదారులపై టోల్‌ గేట్ల వ్యవహారంపై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న విషయం విదితమే. అది అతి త్వరలో అమల్లోకి రాబోతోంది. తద్వారా సుమారు 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని అంచనా వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏ బాదుడు బాదినా, దానికి ఓ కారణం ప్రభుత్వం దగ్గర ఎప్పుడూ వుంటుంది. మొన్నామధ్య ‘రోడ్లను బాగు చేయడం కోసం..’ అంటూ ప్రభుత్వ పెద్దలు ఓ కథ చెప్పారు. కానీ, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా వుందో.. ఆ రోడ్ల మీద గోతుల్లో పడ్డ వాహనాల్ని నడుపుతున్నవారికే తెలుసు.

కొన్ని ప్రాంతాల్లో అయితే, అసలు రోడ్లున్నాయా.? రోడ్లు కొట్టుకుని ఉత్త మట్టి మాత్రమే మిగిలిందా.? అన్న అనుమానం కలగక మానదు. అలాంటి రోడ్లు బాగు చేయడానికి మళ్ళీ టోల్‌ గోట్లు అవసరమయ్యాయి ప్రభుత్వానికి. రాష్ట్రం తొలుత అభివృద్ధి చెందాలి.. ఆ అభివృద్ధి ద్వారా ఆదాయం పెరిగితే, అప్పుడు కదా సంక్షేమ ఫలాల్ని ప్రజలకు అందించాలి. కానీ, ఇక్కడంతా రివర్స్‌. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు.. అదే మొదటి ప్రాధాన్యత అయిపోయింది. ఆ సంక్షేమం కోసం మళ్ళీ జనాన్నే బాదేస్తున్నారు. అంటే, ఓ వైపు సంక్షేమం.. ఇంకో వైపు నిలువు దోపిడీ అన్నమాట.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: ‘అవి మావి కావు’.. జాన్వీ కపూర్ ఎక్స్ పోస్టులపై...

Janhvi Kapoor: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు, ఫ్యాషన్, ఫొటోషూట్స్.. అభిమానులతో పంచుకుంటూ...

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

రాజకీయం

వైఎస్ జగన్ ‘తాడేపల్లి ప్యాలెస్‌’పై ఎందుకింత రచ్చ.?

కాదేదీ, రాజకీయానికి అనర్హం.! ఔను, ఇందులో వింతేముంది.? ఏళ్ళ తరబడి.. కాదు కాదు, దశాబ్దాలుగా చూస్తున్నదే కదా.! కాకపోతే, ఇప్పుడు రాజకీయం మరింత దిగజారిపోయింది.! ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? లింగమనేని...

ఈవీఎంలు మోసం చేశాయ్.! వైఎస్ జగన్ కొత్త నాటకం.!

ఓటమికి కారణం దొరికేసింది.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన ఓటమికి కారణమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై యుద్ధం ప్రకటించేశారు.! వైసీపీ కార్యకర్తలంతా, ‘మేము సైతం సిద్ధం’ అంటూ సోషల్ మీడియా వేదికగా...

ఈసారి అసెంబ్లీ సెషన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ...

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 15 జూన్ 2024

పంచాంగం తేదీ 15- 06-2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు తిథి: శుక్ల నవమి రా.12.35, తదుపరి...

Janhvi Kapoor: ‘అవి మావి కావు’.. జాన్వీ కపూర్ ఎక్స్ పోస్టులపై టీమ్ క్లారిటీ

Janhvi Kapoor: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు, ఫ్యాషన్, ఫొటోషూట్స్.. అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆమె పేరుతో ఉన్న...

పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా: టీడీపీలో కొందరికి నచ్చట్లేదా.?

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా, ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ అనే బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఆ బ్యానర్ల మీద, జనసేన నేతల ఫొటోలే కాదు, టీడీపీ అలాగే బీజేపీ నేతల ఫొటోలూ...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

భారీ వేతనంతో సింగరేణిలో ఉద్యోగాలు

కొత్తగూడెం లోని సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్...