ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తగిన భద్రత ఇవ్వాల్సిందే.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. రాజకీయాల్ని పక్కన పెడితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన భద్రత అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం.
అందుకే కదా, పది పదిహేను కిలోమీటర్ల దూరానికి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ని వినియోగిస్తుంటారు. అదే సమయంలో, ఆ మార్గంలో రోడ్డు మీద కూడా ట్రాఫిక్ నిలిపివేస్తుంటారు.!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు వెళితే, రోడ్డు పొడవునా తాత్కాలికంగా డేరాల్ని ఏర్పాటు చేయడం చూస్తుంటాం. చెట్లను నరికేస్తారు.. అబ్బో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత నిమిత్తం, రాష్ట్ర పోలీసు యంత్రాంగం తీసుకునే చర్యలు అన్నీ ఇన్నీ కావు.
ఇప్పుడేమో, ముఖ్యమంత్రి భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం వున్నందున జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఆయనకు కల్పించాలంటూ ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం, కేంద్రానికి లేఖ రాసిందట. ఇంటెలిజెన్స్ అనుమానించిందంటే.. ఖచ్చితంగా కేంద్రం, ‘తగిన విధంగా’ స్పందించాలి.
అంతా బాగానే వుందిగానీ.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏంటి.? ‘ఏం పీకావని నీకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కావాలి.? అది తీసేస్తే వెంటనే ఫినిష్ అయిపోతారు చంద్రబాబు..’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక్కడ థ్రెట్ అనేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంటే చంద్రబాబుకే ఎక్కువ వుంది. అదీ వైసీపీ నేతల నుంచి.! మరి, ఇంటెలిజెన్స్ విభాగానికి ఇవేవీ అర్థం కావడంలేదా.?