Switch to English

జనసేనకు ఎన్ని సీట్లు.? వైసీపీలో అంతర్మధనమెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకే ఒక్క సీటు గెలచుకుంది. ఓట్ల శాతం కూడా సింగిల్ డిజిట్ దాటలేదు.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు.! తాను ఓడిపోయిన విషయాన్ని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతుంటారు. ఇందులో దాచుకోవడానికేముంది.?

2024 ఎన్నికలనాటికి పరిస్థితులు ఎలా వుండబోతున్నాయ్.? 175 సీట్లకు 175 సీట్లూ గెలిచేస్తామని అధికార వైసీపీ గట్టిగా చెబుతోంది. అంటే, విపక్షాలకు ఒక్క సీటు కూడా దక్కబోదన్నమాట. అలాంటప్పుడు టీడీపీ – బీజేపీ – జనసేన కలిసినా వైసీపీకి ఇబ్బంది ఏముంటుంది.? కానీ, వైసీపీ ఇబ్బంది పడుతోంది.

నిజానికి, టీడీపీ విషయంలో వైసీపీకి పెద్దగా సమస్య లేదు. ఆ ‘60-40’ అవగాహన ఏంటన్నది ఆ రెండు పార్టీలకే తెలియాలి. కానీ, ఓ ఖచ్చితమైన అవగాహనతో టీడీపీ విషయంలో వైసీపీ ‘జాకీలేసి లేపే’ వ్యవహారమైతే చేస్తోంది. తేకపోతే, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ‘జనసేన పార్టీ 30 సీట్లు అడుగుతోందట, చంద్రబాబు 15 సీట్లే ఇస్తామంటున్నారట.. ఇది మాకున్న సమాచారం’ అని చెప్పడమేంటి.?

175 సీట్లూ గెలిచేస్తామనే ధీమా వున్న పార్టీకి, ఇతర పార్టీల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరమేముంటుంది.? కానీ, వైసీపీ చాలా చాలా ఆందోళన చెందుతోంది జనసేన విషయంలో. అందుకే, గత కొద్ది కాలంగా వైసీపీ అధినేత దగ్గర్నుంచి, సోషల్ మీడియా కార్మికుల వరకూ.. జనసేన మీదనే స్పెషల్ ఫోకస్ పెట్టారు.

విశాఖలో పవన్ కళ్యాణ్‌ని హోటల్ రూమ్‌కే పరిమితం చేశారు. కానీ, టీడీపీ సభలకు, కార్యక్రమాలకు మాత్రం పూర్తిగా సహకరిస్తున్నట్లే కనిపిస్తోంది వైసీపీ సర్కారు. ఏదో తప్పదన్నట్టు టీడీపీ మీద నాలుగు విమర్శలు తప్పితే, నిజానికి టీడీపీ పట్ల వైసీపీకి అంత వ్యతిరేకత ఏమీ లేనట్లే వుంది.

జనసేనకు గనుక ఓ పాతిక ముప్ఫయ్ సీట్లు వస్తే.. ప్రజల్లో మార్పు వచ్చేసినట్లే.. ఆ మార్పు రాకూడదన్న భయం వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ జనసేన అధికారంలోకి వస్తేనో.? ఇది ఇంకా భయపెడుతోంది వైసీపీని. అందుకే, జనసన ఇమేజ్‌ని తగ్గించడం కోసం ‘చంద్రబాబు దత్త పుత్రుడు’ అంటూ పవన్ కళ్యాణ్ మీద పసలేని విమర్శలు చేస్తున్నారు వైసీపీ అధినేత.

కానీ, నిజానికి చంద్రబాబుకి దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నది వైఎస్ జగన్. చంద్రబాబు అవినీతి మీద పుస్తకాలు ప్రచురించి, ఢిల్లీదాకా వెళ్ళి హంగామా చేసిన వైసీపీ, తాము అధికారంలోకి వచ్చాక ఎందుకు ఆ అవినీతిని వెలికి తీయట్లేదు.? ఇదొక్కటి చాలు టీడీపీకి జగన్ ఎంతలా దత్తపుత్రుడైపోయాడో చెప్పడానికి.. అంటూ సోషల్ మీడియాలోనే కాదు, జన బాహుళ్యంలోనూ చర్చ జరుగుతోంది.

అందుకే, ఆ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం ‘టీడీపీతో జనసేన పొత్తు.. 30 కాదు 15 సీట్లు మాత్రమే ఇస్తామన్నారట..’ అంటూ, సజ్జల మార్కు హైడ్రామాకి తెరలేపారన్నమాట.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...