వైసీపీకి పవన్‌ కళ్యాణ్‌ మీద ‘ప్రేమ’ ఎక్కువైపోయింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,407FansLike
57,764FollowersFollow

వున్నపళంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మీద ‘ప్రేమ’ ఎక్కువైపోయింది.! వైఎస్సార్సీపీ వాయిస్‌, టీడీపీ విషయంలో సరిపోవడంలేదని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ అనుకుంటున్నారా.? లేకపోతే, చంద్రబాబుని విమర్శించేందుకు పవన్‌ కళ్యాణ్‌ ‘సాయం’ ఎందుకు టీడీపీ నేతలు అర్ధిస్తున్నారు.? ఏమో, వైసీపీ నేతలకే తెలియాలి.

అసలు విషయానికొస్తే, టీడీపీ అధినేత చంద్రబాబుకి సంబంధించిన అత్యంత సన్నిహితులపై ఐటీ సోదాలు గత కొద్ది రోజులుగా జరిగిన విషయం విదితమే. ఆ సోదాలకు సంబంధించి 2 వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల్ని ఐటీ శాఖ గుర్తించింది. ఈ విషయాన్ని ఐటీ శాఖ అధికారికంగా ధృవీకరించింది కూడా. ఇకనేం, వైఎస్సార్సీపీ పండగ చేసుకుంటోంది. వైసీపీకి సంబంధించిన మంత్రులు, ఇతర ముఖ్య నేతలు చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచే హంగామా షురూ అయ్యింది.

ఇక, ఈ వ్యవహారంపై వివిధ ఛానెళ్ళలో చర్చా కార్యక్రమాల సందర్భంగా జనసేన పార్టీ తరఫున కూడా వాయిస్‌ గట్టిగానే విన్పించింది. అటు వైఎస్‌ జగన్‌, ఇటు చంద్రబాబు.. ఇద్దరూ అవినీతి పరులేనని జనసేన తేల్చి చెబుతోంది. బీజేపీ కూడా అదే వాయిస్‌తో నినదిస్తోంది. అయినాగానీ, చంద్రబాబుని విమర్శించడానికి పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు రావడంలేదు.? అంటూ వైసీపీ నేతలు తెగ బాధపడిపోతున్నారు.

ఒకరా.? ఇద్దరా.? వైసీపీ నేతలందరి డిమాండూ ఒకటే.. పవన్‌ కళ్యాణ్‌ రావాలి, చంద్రబాబుని విమర్శించేయాలి. ఖచ్చితంగా వస్తారు.. పవన్‌ కళ్యాణ్‌ వస్తే, ఆ తర్వాత సీన్‌ ఎలా వుంటుందో ఊహించుకోవాల్సిన పనిలేదు. ప్రతి శుక్రవారం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎందుకు కోర్టుకు హాజరు కావాల్సి వస్తోంది.? అలా హాజరు కావాల్సిన పరిస్థితిని తప్పించుకునేందుకు ఆయన ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు.? అన్నది అందరికీ తెలిసిన విషయమే.

వైఎస్‌ జగన్‌ సంగతేంటో సీబీఐ ఎప్పటినుంచో చెబుతూనే వుంది. ఇప్పుడు చంద్రబాబు సంగతి తేల్చడానికి ఐటీ శాఖ సర్వసన్నద్ధమవుతోంది. ఒకర్ని మించి ఇంకొకరు.. పవన్‌ కళ్యాణ్‌ మీడియా ముందుకొస్తే.. ఈ రెండు విషయాలూ ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. ఆ ముచ్చట తీర్చుకోవాలని తెగ సంబరపడిపోతోంది వైఎస్సార్సీపీ. ఒక్కడ ఓ విషయం వైసీపీ నేతలు మర్చిపోతున్నారు.. 2 వేల కోట్ల రూపాయలంటూ చంద్రబాబుని ‘దొంగ’గా చిత్రీకరిస్తున్న వైసీపీ నేతలు, దాదాపు 43 వేల కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తుల అభియోగాల్ని ఎదుర్కొంటున్న వైఎస్‌ జగన్‌ని కూడా అదే రీతిన ‘గౌరవిస్తుండడం’ హాస్యాస్పదం కాక మరేమిటి.?

10 COMMENTS

సినిమా

Bala Krishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్....

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

రాజకీయం

పయ్యావుల ప్రశ్నలతో మండలిలో బొత్సకు ఇబ్బంది

అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర, రాష్ట్ర...

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, వీఏవోలతో చర్చకు సిద్ధం: నారా లోకేష్

అమరావతి: అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వీఏవోల సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయాల్సిన అవసరం...

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం: నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్...

ఎక్కువ చదివినవి

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ,...

దుబాయ్‌లో అలర్ట్ పరిస్థితి.. తెలుగు వారితో ఈటెల రాజేందర్ ఫోన్ సంభాషణ

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న తెలుగు ప్రజలతో ఈటెల రాజేందర్ ఫోన్ ద్వారా మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. బాంబుల మోతలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష ఇబ్బందులు...

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

Chiranjeevi: ‘50 రోజుల మన శంకరవరప్రసాద్ గారు’.. వండర్స్ ఎన్నో..

Chiranjeevi: ఓ సినిమా హిట్టయితే టీమ్ కి ఆనందం. నటీనటులకు సంతోషం. బయ్యర్లకు సంబరం. కానీ, ఓ సినిమా హిట్టయితే వీటన్నింటితోపాటు ఆ సినిమా హీరో అభిమానులకు పండగ.. ఎనలేని ఉత్సాహం. ఆనందభాష్పాలతో...

ప్రతి ఇంటికి జనసేన సిద్ధాంతాలు చేర్చాలి: ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గం గాయత్రి నగర్ డివిజన్‌లో జనసేన పార్టీ క్రియాశీలక ఉద్యమి సభ్యత్వ నమోదు శిబిరం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని జనసేన పార్టీ సైబరాబాద్ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్...